టాలీవుడ్ లో వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే.  సినీ తారలపై వస్తున్న బయోపిక్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది.  నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’మంచి విజయం సాధించింది.  నిన్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తీసిన ‘సంజు’ సినిమాకు మంచి పాజిటీవ్ టాక్ వచ్చింది. కలెక్షన్ల పరంగా కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.  అయితే మొదటి సారిగా తెలుగులో రాజకీయ నేపథ్యంలో బయోపిక్ సినిమాలు వస్తున్నాయి. 
Related image
ఇప్పటికే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో వైఎస్సార్‌గా కనిపిస్తుండగా.. సుహాసిని, భూమిక, పోసాని క‌ృష్ణమురళి తదితరులు ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఆనందో బ్రహ్మ దర్శకుడు మహి వి రాఘవ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 

ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్ డేట్ బయటికి వస్తుంది.  తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. కర్నూల్‌కు చెందిన ఓ రాజకీయనాయకురాలిగా అనసూయ కనిపించనున్నట్లు తెలుస్తోంది.  ‘రంగస్థలం’ సినిమాలో రత్తమ్మత్తగా అనసూయ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దాంతో అనసూయకు వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి. అయితే వైఎస్సార్ బయోపిక్ లో యాంకర్ అనసూయ నటిస్తుందా..లేదా అన్న విషయం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే రామ్ చరణ్ హీరోగా ఇటీవల వచ్చిన రంగస్థలంలో అనసూయ కీలక పాత్రలో నటించి విమర్శకులు ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే.  


మరింత సమాచారం తెలుసుకోండి: