ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ కొనసాగుతుంది.  కొత్త చిత్రం రిలీజ్ అయితే..హిట్ టాక్ తెచ్చుకుంటే వెంటనే సక్సెస్ మీట్స్, పార్టీలు చేసుకుంటున్నారు.  అంతే కాదు విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. తాజాగా ఓ విషయంలో భల్లాలదేవుడు అదేనండీ రానా తన తండ్రిపై అలిగాడు.. మీరంతా పార్టీ చేసుకుంటూ నన్నెందుకు పిలవలేదని  దగ్గుబాటి సురేష్ బాబును ప్రశ్నిస్తున్నాడు హీరో రానా.  ఇంతకీ అసలు విషయం ఏంటంటారా? సురేష్ బాబు నిర్మాతగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన "ఈ నగరానికి ఏమైంది?" సినిమా హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ ఓ హోటల్ లో పార్టీ చేసుకుంది. 
Image result for nagaraniki emaindi
 ‘పెళ్లిచూపులు’ చిత్రంలో దర్శకుల్లోకెల్లా తనకంటూ ప్రత్యేకస్థానం ఉందని నిరూపించుకున్నాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఈయన డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం ఈ రోజే విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది.  దీంతో ఎంతో ఆనందపడిన చిత్రయూనిట్ అంతా కలిసి ఓ హోటల్‌లో సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో యూనిట్ సభ్యులంతా పాల్గొన్నారు. ఈ పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Image result for nagaraniki emaindi
కాగా నిర్మాత సురేష్ బాబు తనయుడు రానా ఈ సంబరాలకు ‘‘నన్నెందుకు పిలవలేదంటూ’’ సోషల్ మీడియా వేదికగా అడగటం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఈ పార్టీలో సురేష్ బాబుతో పాటు తరుణ్ భాస్కర్, చిత్రంలో నటించిన విష్వక్సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, కే వెంకటేష్, అనీషా అంబ్రోస్, అభినవ్, సిమ్రన్ చౌదవి వంటి వారంతా ఒకచోట చేరారు. ఇక ఆ ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసిన రానా "నన్ను ఎందుకు పిలవలేదు?" అని ప్రశ్నించాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: