టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో హీరోయిన్ గా రామ్ సరసన పరిచయం అయ్యింది గోవా బ్యూటీ ఇలియానా.  తెలుగు లో టాప్ హీరోల సరసన నటించి తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.  ఓ వైపు తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి ఫామ్ లో ఉండగానే బర్ఫీ సినిమాతో బాలీవుడ్ బాటపట్టింది గోవా సోయగం ఇలియానా. రవితేజ నటించిన దేవుడు చేసిన మనుషులు తరువాత ఈ సుందరి మరే తెలుగు చిత్రంలో నటించలేదు. 
Ileana re entry in Tollywood with Star Hero
అయితే అక్కడ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది..దాంతో మళ్లీ తెలుగు లో రీ ఎంట్రీ ఇవ్వాలని చూసింది కానీ తనకు ఆ చాన్స్ దక్కలేదు.  అప్పటికే టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు మంచి ఫామ్ లోకి వచ్చారు.  దాదాపు ఆరేళ్ల విరామం అనంతరం మళ్లీ రవితేజ సినిమాతోనే రీఎంట్రీ ఇస్తున్నది. వివరాల్లోకి వెళితే...గత ఆరేళ్లుగా తెలుగులో పునరాగమనం కోసం ఎదురు చూస్తున్న ఇలియానా ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న అమర్ అక్బర్ ఆంటోని చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నది. 
Image result for iliana
శ్రీను వైట్ల దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్, మోహన్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇలియానా కు ఉన్న క్రేజ్ ఇంకా తగ్గలేదని నిరూపించింది.  ఈ సినిమాలో నటించడానికి ఆమె రెండు కోట్లు డిమాండ్ చేసిందని, అయితే చిత్ర వర్గాలు కోటిన్నర పారితోషికానికి ఇలియానాను ఒప్పించినట్లు సమాచారం.  ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ సినిమాలో ఓ హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తుండగా, ప్రధాన నాయికగా ఇలియానాను తీసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: