ఈ మద్య సోషల్ మీడియాలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి ఎన్నో విషయాలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో డ్రగ్స్ రాకెట్ ఎంతగా కుంగదీసిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో సినీ సెలబ్రెటీలకు లింకులు ఉన్నాయని వార్తలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఇదిలా ఉండగా నటి శ్రీరెడ్డి టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ బాగా జరుగుతుందని పోరాటం చేసింది.
ఫిలిమ్ ఛాంబర్ ముందు తనకు కార్డు ఇవ్వడం లేదని అర్థనగ్న ప్రదర్శన కూడా చేసింది. ముఖ్యంగా తనను మోసం చేశాడని డి.సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరామ్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ చేసింది. దాంతో కొంత కాలం దగ్గుబాటి ఫ్యామిలీ ఇబ్బందుల్లో పడ్డారు. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్లు అమెరికాలో సెక్స్ రాకెట్ లో పాల్గొన్నారని వార్తలు ఊదరగొడుతున్నాయి.
తాజాగా ఈ విషయంపై స్పందించిన ప్రముఖ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ..సినీ పరిశ్రమకు చెడ్డపేరు తెస్తున్నవారిని నియంత్రించడం అంత సులభం కాదని ప్రతిభ ఉన్నవారందరికీ ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయని చెప్పారు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యలపై ఇప్పటికే కమిటీ వేశామని తెలిపారు. ఎక్కడ ఏది జరిగినా దానికి సినీపరిశ్రమనే భాధ్యురాలిగా చేయడం దారుణమని అన్నారు. ఎక్కడో అమెరికాలో సెక్స్ రాకెట్ బయటపడినా... దానికి, టాలీవుడ్ కు లింక్ పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరో కూడా తమకు తెలియదని అన్నారు. ఈ మద్య చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదని చాలా మంది ప్రచారం చేస్తున్నారని..అందులో వాస్తవం లేదని..మంచి సినిమా అయితే థియేటర్లకు ఏ ప్రాబ్లం ఉండదని ఆయన అన్నారు. 50 ఏళ్ల సురేష్ ప్రొడక్షన్స్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. కేవలం గొప్ప చిత్రాల నిర్మాణమే కాకుండా, సంస్థ పది కాలాల పాటు కొనసాగేలా కూడా చిత్ర నిర్మాణం ఉండాలని అన్నారు.