అక్కినేని నాగ చైతన్య, సమంతలు ఏమాయ చేసావే సినిమాలో కలిసి పనిచేసి అప్పటి నుండి ఒకరంటే ఒకరు ఇష్టపడి లాస్ట్ ఇయర్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా తన ఫాం ఏమాత్రం కోల్పోని సమంత వరుస సినిమాలు చేస్తుంది. మరోపక్క చైతు కూడా సినిమాలతో బిజీగా ఉన్నాడు.


పెళ్లి తర్వాత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న ఈ ఇద్దరి మధ్యలో ఒక అమ్మాయి వచ్చిందట. ఆమె వల్ల ఇద్దరు ఇబ్బందులు పడుతున్నారని అంటున్నారు. ఏంటి ఇదంతా నిజమేనా అంటే రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో అని తెలుస్తుంది. మనం తర్వాత చైతు, సమంతలు కలిసి చేస్తున్న సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.


నిన్ను కోరి సినిమా డైరెక్ట్ చేసిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరక్కుతుంది. చైతు, సమంతలు భార్యా భర్తలుగా నటించబోయే ఈ సినిమాలో ఇద్దరి మధ్యలో ఒక అమ్మాయి వచ్చి వారిని దూరం చేస్తుందట. అయితే చైతు, సమంతల ప్రేమ విలువ చెప్పేలా సినిమా కథ ఉంటుందట.


ఈ సినిమా తప్పకుండా వారి పర్సనల్ లైఫ్ ను రిఫ్లెక్ట్ చేసే అవకాశం ఉంది. దాదాపు శివ తీసిన నిన్ను కోరి కూడా లవర్ పెళ్లి చేసుకున్న అమ్మయి ఇంటికి వెళ్తాడు. కాని ఇప్పుడు పెళ్లైన అబ్బాయిని ఓ అమ్మాయి ఇష్టపడుతుంది. మరి ఈ కథను శివ నిర్వాణ ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: