బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సంజూ మూవీ బాక్సాఫీస్ కలెక్షన్లలో కొత్త రికార్డులు కొల్లగొడుతోంది. రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కిన ‘సంజు’ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే బాక్సాఫీస్ని రూల్ చేస్తోంది. సంజయ్ దత్ జీవితాధారంగా తెరకెక్కిన ఈ బయోపిక్ రూ.120కోట్ల గ్రాస్తో ఆల్టైమ్ హయ్యెస్ట్ ఓపెనర్(హిందీ సినిమాల పరంగా)గా నిలిచింది.
ఈ ఏడాదిలో తొలి వీకెండ్ లో ఈ రేంజ్ వసూళ్లు సాధించిన సినిమాలు మరేవీ లేవు. సల్మాన్ ఖాన్ సినిమా ‘రేస్ త్రీ’ రజనీకాంత్ ‘కాలా’లు కూడా తొలి వారాంతానికి ఈ స్థాయి వసూళ్లను సాధించలేదు. సంజయ్ దత్ బయోపిక్ గా ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. ఆ హీరో జీవితంలో ఏం జరిగిందో తెలుసుకునే ఆసక్తి వ్యక్తమైంది. టీజర్, ట్రైలర్లులు సినిమాపై అంచనాలను పెంచాయి.
అత్యంత భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5,300 స్క్రీన్లపై ప్రదర్శితమైంది. వీటిల్లో 4000 స్క్రీన్లు ఇండియాలోకి కాగా, మిగతావి విదేశాల్లోనివి. ఈ రకంగా చూస్తే ఇదొక రికార్డే. ఒకే భాషలో విడుదలైన సినిమా ఇన్ని స్క్రీన్ల మీద ప్రదర్శితం కావడం ఇండియా వరకూ రికార్డే. రాజ్కుమార్ హిరానీ సినిమాలకు ఉన్న క్రేజ్తోపాటు.. సినిమా ట్రైలర్కే అంచనాలకు మించి రెస్పాన్స్ రావడంతో సంజూ ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి.
చాలా వరకు సినిమాకు పాజిటివ్ రీవ్యూలు రావడం కూడా కలెక్షన్లకు కలిసొచ్చింది. ఇక వసూళ్లలో దూసుకు పోతున్న ‘సంజు’ బయోపిక్ ‘బాహుబలి 2’ గ్రాస్ రికార్డ్ను కూడా రూ.46.71కోట్ల వసూళ్లతో ఆదివారం బీట్ చేసేసింది. పాపులర్ ట్రేడ్ అనలిస్ట్ అంచనా ప్రకారం సంజు ఆదివారం రూ.46.71 కోట్లను కలెక్ట్ చేసింది. శుక్రవారం రూ.34.75కోట్లు, శనివారం 38.60 కోట్లతో తొలి మూడు రోజుల్లో రూ.120.06కోట్లను కలెక్ట్ చేసింది. సంజు ఈ వీకెండ్లో రూ.200కోట్ల క్లబ్లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్క.