సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రం ‘తేజ్’. ఐ లవ్ యు అనేది ఉపశీర్షిక. 'తేజ్ ఐ లవ్ యు' చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది.
ఈ చిత్రానికి ఎలాంటి కత్తిరింపులు లేకుండా 'యూ' సర్టిఫికేట్ను జారీ చేశారు. ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కేఎస్ రామారావు నిర్మించగా.. గోపి సుందర్ సంగీతం అందించారు. ఇప్పటికే వరుసగా ఐదు పరాజయాలను ఖాతాలో వేసుకున్న సాయి ధరమ్ తేజ్ ఈ మూవీపై చాలా అంచనాలే పెట్టుకున్నాడు.
భీమవరంలో నిన్ననే ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక పూర్తి చేసుకుంది. కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ చిత్రానికి ఎ.కరుణాకరన్ దర్శకత్వం వహించాడు. సాయిధరమ్ తేజ్, అనుపమ పరమేశ్వరన్, జయప్రకాశ్, పవిత్రా లోకేశ్, పృథ్వీ, సురేఖా వాణి, వైవా హర్ష, జోష్ రవి, అరుణ్ కుమార్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి లిరిక్స్: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, పోతుల రవికిరణ్, గోశాల రాంబాబు.
స్టంట్స్: వెంకట్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: సతీశ్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్, చీఫ్ కో డైరెక్టర్: చలసాని రామారావు, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: సాహి సురేశ్, సంగీతం: గోపీ సుందర్, సినిమాటోగ్రఫీ: అండ్రూ.ఐ, మాటలు: డార్లింగ్ స్వామి, సహ నిర్మాత: వల్లభ, నిర్మాత: కె.ఎస్.రామారావు, కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎ.కరుణాకరన్.ఈ సినిమా ఈ నెల 6న విడుదలవుతుంది.