‘బిగ్ బాస్ 2’ షోపై బుల్లితెర ప్రేక్షకులలో ఆసక్తిని పెంచి ఈ షోకు మంచి రేటింగ్స్ ను తీసుకుకురావడానికి ఈ షో నిర్వాహకులు ఇక ఆఖరి అస్త్రంగా నిన్న రాత్రి ప్రసారం అయిన షోలో బ్రహ్మండమైన హైడ్రామాకు తెర తీసారు. ఒకే బెడ్ మీద తనీష్ దీప్తి సునైన పడుకోవడం అలాగే వారిద్దరూ దుప్పట్లో దూరడం వంటి విషయాల పై ‘బిగ్ బాస్’ హౌస్ లో శ్యామల గీతామాధురి యాంకర్ దీప్తి మధ్య భారీ చర్చ జరిగినట్లు చూపిస్తూ మన ఇంటి పక్క ఉండే ఇరుగు పొరుగు వారి పాత్రలను సమర్ధవంతంగా చూపించారు.
ఇది చాలదు అన్నట్లుగా దీప్తి సునైనా తేజస్విని సాగిస్తున్న రొమాన్స్ గురించి తోటి సభ్యులతో గుసగుసలు ఆడటం తనపై చాటుమాటుగా జరుతున్న ప్రచారం పై బాబు గోగినేనితో తేజస్విని చెప్పుకొని బాధపదాటం లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ‘బిగ్ బాస్ 2’ కి మంచి రేటింగ్స్ వచ్చేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న సోమవారం మధ్యాహ్నం తనీష్, అమిత్ లను కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన ‘బిగ్ బాస్’ ఒక సీక్రెట్ టాస్క్ఇవ్వడమే కాకుండా దాని ప్రకారం ఏదో ఒక నాటకం ఆడి ఇంటి సభ్యులను నమ్మిస్తే అందరికీ మంచి విందు ఏర్పాటు చేస్తానని ‘బిగ్ బాస్’ హామీ ఇచ్చిన నేపధ్యంలో ఈ అఫైర్ల అంశం బుల్లితెర పైకి వచ్చింది.
దీనితో నిన్నటి షోలో ‘బిగ్ బాస్’ సభ్యుల మధ్య మరింత విభేదాలు సృష్టించి ఒక డ్రామాను క్రియేట్ చేయడానికి ఈ షో నిర్వాహకులు పెద్ద ప్రయత్నాలు చేసారు. ఇది ఇలా ఉండగా ఈనాల్గోవ వారానికి ‘బిగ్ బాస్’ ఇంట్లో నామినేషన్ ప్రక్రియప్రారంభం అయింది. ఈ ప్రక్రియలో సామ్రాట్, తనిష్ లు తప్ప మిగితా వారందరూ ఒకరిని మరొకరు నామినేట్ చేసుకొన్నారు.
ఈవారం ఇంటి సభ్యులు చాలామంది ఎలిమినేషన్ కు నామినేట్ కావడంతో ఈకార్యక్రమానికి ఓట్లు ఎక్కువ పడేలా ఈ కార్యక్రమ నిర్వాహకులు మాస్టర్ ప్లాన్ వేసారు. ఇది చాలదు అన్నట్లుగా గీతా మాధురికి ‘బిగ్ బాస్’ జైలు శిక్ష విధించడంతో ఆమె జైలు గోడపై వందసార్లు తప్పు జరిగింది అని రాయమని బిగ్ బాస్ ఆదేశించడం నిన్నటి కార్యక్రమ హైలెట్. ఆసక్తి కలిగించే టాస్క్ లు లేకుండా కేవలం అఫైర్ ల చీప్ ట్రిక్స్ ను నమ్ముకుని ఈవారానికి ఈషో నిర్వాహకులు చేస్తున్న ఈ చీప్ ట్రిక్స్ బుల్లి తెర ప్రేక్షకులలో చాలామందిని ఆశ్చర్య పరిచాయి..