‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తరువాత త్రివిక్రమ్ పవన్ ల మధ్య దూరం పెరిగింది అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఈవార్తలను త్రివిక్రమ్ శ్రీనివాస్ ఖండించినా ఇంకా ఈ గాసిప్పుల హడావిడి కొనసాగుతూనే ఉంది. అయితే అనుకోకుండా వీరిద్దరినీ కలిపిన ఘనత త్రివిక్రమ్ భార్య సౌజన్యా శ్రీనివాస్ కు దక్కింది. 

శాస్త్రీయ నృత్య కళాకారిణిగా పేరు గాంచిన త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్యా శ్రీనివాస్ భరతనాట్య ప్రదర్శన మొన్న రాత్రి భాగ్యనగరంలోని రవీంద్ర భారతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ తన భార్య అన్నాతో సహా కలిసి హాజరు అవ్వడమే కాకుండా ఈకార్యక్రమాన్ని చాల ఆహ్లాదకరంగా వీక్షించడం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. 
Pawan Kalyan
ఈకార్యక్రమంలో పవన్ త్రివిక్రమ్ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒకరి పక్కన ఒకరు కూర్చుని ఉండటమే కాకుండా అత్యంత అభిమానంతో వీరు ముగ్గురూ మాట్లాడుకున్న తీరు మీడియా కెమెరాలకు విపరీతమైన పని కలిపించి పవన్ త్రివిక్రమ్ ల మధ్య సాన్నిహిత్యం ఏమాత్రం చెడిపోలేదు అన్న సంకేతాలను ఇచ్చింది.  ఆమధ్య నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’ ఆడియో ఫంక్షన్ కు పవన్ వచ్చి త్రివిక్రమ్ రాకపోవడంతో వీరిద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి అంటూ ప్రచారం జరిగింది.
It's OFFICIAL :: Trivikram Srinivas and Pawan Kalyan will work together from November !
అయితే ఆ ప్రచారానికి సమాధానంగా త్రివిక్రమ్ పవన్ ల మైత్రి కొనసాగుతోంది అన్న సంకేతాలు త్రివిక్రమ్ భార్య డాన్స్ ప్రోగ్రాం ద్వారా అందరికీ తెలిసేడట్లుగా ఈ సంఘటన పాజిటివ్ సంకేతానలను ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ఈమధ్య పవన్ ఇస్తున్న రాజకీయ ఉపన్యాసాలలో సరైన వేడి కనిపించడం లేదు అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో రానున్న రోజులలో త్రివిక్రమ్ మళ్ళీ పవన్ ఉపన్యాసాల వెనుక ‘అజ్ఞాతవాసి’ గా మారినా ఆశ్చర్యపడనవసరం లేదు అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: