బాలీవుడ్ లో డిస్కో డ్యాన్స్ కింగ్ మిథున్ చక్రవర్తి అంటే ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  అప్పట్లో డిస్కో డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్ లో కొత్త డ్రెండ్ సృష్టించారు.   ప్రస్తుతం మిథున్ చక్రవర్తి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.  ఆ మద్య వెంకటేష్, పవన్ కళ్యాన్ నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో కూడా నటించారు మిథున్ చక్రవర్తి.  తాజాగా మిథున్ చక్రవర్తి తనయుడు పెళ్లి పేరుతో మహాక్షయ్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని, అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ బాధిత యువతి ఢిల్లీలోని రోహిణి కోర్టును ఆశ్రయించింది.

అయితే విషయం సెలబ్రెటీలది కనుక పోలీసులు కూడా అన్నీ కోణాల్లో విచారించిన తర్వాత కేసు నమోదు చేసుకున్నట్లు సమాచారం. కాగా, యువతి పిటిషన్‌ను విచారించిన కోర్టు వారిద్దరిపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. బాధిత యువతి కోర్టుకు సమర్పించిన పిటిషన్ ప్రకారం..  గత మూడు సంవత్సరాలు గా ఆ యువతితో మహాక్షయ్ సంబంధం కొనసాగిస్తున్నట్లు తేలింది. 
Image result for mithun chakraborty family
ప్రతి నిత్యం ఫోన్, చాటింగ్ ద్వారా మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఓసారి మహాక్షయ్ తన ఫ్లాట్‌కు రావాల్సిందిగా యువతిని కోరాడు.  మొదటి నుంచి వీరిద్దరి మద్య చనువు ఉండటంతో ఆ యువతి ఫ్లాట్ కి వెళ్లింది.  ఆ సమయంలో యువతికి మహాక్షయ్‌  బలవంతంగా మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి పేరుతో పలుమార్లు ఆమెను బలవంతం చేశాడు.

ఈ క్రమంలో గర్భవతి అయిన యువతికి గర్భనిరోధక మందులు ఇవ్వడంతో అబార్షన్ అయింది. ఇదిలా ఉంటే..మహాక్షయ్ తల్లి యోగితా తనకు ఫోన్ చేసి పలుమార్లు బెదిరించారని, తన కోడలు కావాలన్న ఆశలు ఏవైనా ఉంటే తుంచేసుకోవాలని బెదిరించారని యువతి ఆరోపించింది. పెళ్లి పేరుతో తనను మోసం చేసి అత్యాచారానికి పాల్పడినందుకే కోర్టుకెక్కినట్టు యువతి పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: