క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెగా కాంపౌండ్ నిర్ణయం పై మొట్టమొదటిసారి తన మనసులోని మాటలను బయటపెట్టింది. రామ్ చరణ్ కెరియర్ బెస్ట్ మూవీగా రికార్డులు క్రియేట్ చేసిన ‘రంగస్థలం’ మూవీలో మొదట సుకుమార్ అనుపమా పరమేశ్వరన్ ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. 
తేజ్ సినిమా పాటల గురించి
అయితే చరణ్ కుటుంబ సభ్యులలోని కొందరు చరణ్ పక్కన అనుపమా పరమేశ్వరన్ చిన్న పిల్లలా కనిపిస్తుందని ఆమెను తప్పించి సుకుమార్ పై ఒత్తిడి చేసి ఆమె స్థానంలో సమంతను ఎంపిక చేసారు అన్న వార్తలు అప్పట్లో వచ్చాయి. ఈవిషయానికి అనుపమ అప్పట్లో చాల నిరాశకు గురైనట్లు గాసిప్పులు కూడ హడావిడి చేసాయి. 
మ‌ల‌యాళంలో ఎందుకు చేయడం లేదు?
అయితే ‘రంగస్థలం’ సినిమా చూసిన తరువాత సమంత చేసిన రామలక్ష్మి పాత్రకు తాను సరిపోనని తనకు అర్ధం అయింది అంటూ ఈవిషయంలో తనకు సుకుమార్ పై వచ్చిన కోపం పూర్తిగా పోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇది ఇలా ఉండగా ఈవారం విడుదల కాబోతున్న ‘తేజ్ ఐ లవ్యూ’ సినిమాను ప్రమోట్ చేస్తూ అనుపమా పరమేశ్వరన్ సాయి ధరమ్ తేజ్ ను ఆకాశానికి ఎత్తేసింది. 
`రంగ‌స్థ‌లం` మీరు చేయాల్సింది? ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?
మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడ ఎంతో వినయంగా ఎటువంటి అహంకారం కనపడనీయకుండా తనతో ప్రవర్తించిన సాయి ధరమ్ తేజ్ తీరు తనకు ఎంతో నచ్చింది అంటూ ప్రశంసలు కురిపించింది. అంతేకాదు ఈసినిమాకు సంబంధించిన పాటలలో సాయి ధరమ్ తేజ్ వేసిన స్టెప్స్ తో కలిపి తాను డాన్స్ చేయడానికి చాల కష్టపడ్డాను అని అంటోంది అనుపమ. ఈవారం విడుదల కాబోతున్న ఈమూవీ ఫలితం సాయి ధరమ్ తేజ్ కెరియర్ తో పాటు అనుపమకు కూడ చాల కీలకంగా మారిన నేపధ్యంలో ఈసినిమా పై చాల ఆశలు పెట్టుకుంది ఈ క్రేజీ హీరోయిన్..    


మరింత సమాచారం తెలుసుకోండి: