టాలీవుడ్ లో కొరటాల శివ దర్శకత్వంలో ‘శ్రీమంతుడు’మంచి విజయం సాధించిన తర్వాత మహేష్ నటించిన రెండు సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి.  మరోసారి కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు మహేష్ బాబు.  ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో రెండు వందల కోట్ల క్లబ్ లో చేరడం మరో విశేషం.  తాజాగా మహేష్ బాబు  ప్రముఖ దర్శకుడు వంశి పైడి పల్లి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం డెహ్రాడూన్ లో నడుస్తుంది. 
Image result for mahesh babu vamsi paidipally
అయితే ఈ సంక్రాంతికి మహేష్ సినిమా రిలీజ్ కాబోతుందని వార్తలు వచ్చాయి. కాగా, ఈ సినిమా రీలీజ్ పై దర్శక, నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు.  ప్రిన్స్ మహేష్ బాబు సినిమా ఏప్రిల్ 5 రిలీజ్ డేట్ లాక్ చేసినట్టుగా చెబుతున్నారు.  దాంతో ఈ సినిమా సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉండొచ్చేమో అన్న వార్తకు దీంతో చెక్ పడినట్టే. ఒకవేళ అలా ముందు అనుకున్నప్పటికీ చేతిలో ఉన్న ఆరు నెలల టైంలో ఇంత భారీ బడ్జెట్ మూవీని ఫినిష్ చేసి విడుదలకు సిద్ధం చేయటం అసాధ్యం కాదు కానీ అందులో రాజీ పడాల్సిన విషయాలు చాలా ఉంటాయి.
Image result for mahesh babu vamsi paidipally
ఏప్రిల్ 5కు మరో విశేషం ఉంది. ఉగాది పర్వదినం ముందు రోజు అది. అంటే ఒకరోజు ముందే అభిమానులకు పండగ స్టార్ట్ అయిపోతుంది.  ఈ సినిమాలో రైతులకు సంబంధించిన మెసేజ్ కూడా జోడించారట.  ఇక అల్లరి నరేష్ పాత్ర మహేష్ తో సమాంతరంగా ప్రయాణం చేస్తూ చాలా కీలకంగా ఉంటుందని అందుకే ఫ్లాష్ బ్యాక్ కాలేజీ ఎపిసోడ్ నుంచే నరేష్ ఎంట్రీ ఇప్పించారని తెలుస్తోంది. 

భరత్ అనే నేను తర్వాత దేవి శ్రీ ప్రసాద్ మరోసారి  మహేష్ కు స్వరాలు సమకూరుస్తున్నాడు. మరి సమ్మర్ సీజన్ లో సైరా-సాహో-2.0 లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ వస్తున్నట్లు సమాచారం..మహేష్ ఎలాంటి హిట్ కొట్టబోతున్నారో ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: