భారతీయ చలన చిత్ర రంగంలో అతిలోక సుందరిగా పేరు తెచ్చుకున్నారు అందాల నటి శ్రీదేవి.  బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి పదహారేళ్ల వయసులోనే హీరోయిన్ గా అగ్ర కథానాయకుల సరసన నటించింది.  తెలుగు, తమిళ, మళియాళ భాషల్లోనే కాదు బాలీవుడ్ లో సైతం తన సత్తా చాటింది.  తెలుగు, తమిళంలో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి అక్కడే స్టార్ ప్రొడ్యూసర్ ని వివాహం చేసుకుంది.  ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు..జాహ్నవి కపూర్, ఖుషీ కపూర్. 

ఆ మద్య దుబాయ్ లో ఓ వివాహ వేడుకకు వెళ్లిన శ్రీదేవి అక్కడే కన్నుమూసింది.  దాంతో సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది.  తాజాగా బోనీకపూర్ - శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ నటిస్తున్న తొలి సినిమా ‘ధడక్’ ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో జాన్వీ బిజీగా ఉంది.
Image result for sridevi family
అయితే, జాన్వీకి సంబంధించిన ఓ ఫొటో సామాజిక మాధ్యమాలకు చేరి వైరల్ గా మారింది.  జాన్వీ తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఈ ఫొటోను షేర్ చేసిన రెండుమూడు గంటల్లోనే దాదాపు రెండు లక్షలకు పైగా లైక్స్, వేలాది కామెంట్స్ వచ్చాయి. ‘నీలో శ్రీదేవిని చూస్తున్నాం’, ‘మీ అమ్మ నీ రూపంలో జీవించే ఉంది’, ‘శ్రీదేవిగారి కళ్లులానే మీ కళ్లూ చాలా ఎక్స్ ప్రెసివ్ గా ఉన్నాయి’ అంటూ జాన్వీని ప్రశంసించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: