కె.విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించి నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న సినిమా స్వాతిముత్యం. తెలుగు సినిమా చరిత్ర గురించి ప్రస్థావించిన ప్రతి సందర్భంలో స్వాతిముత్యం గురించి మాట్లాడుకోవాల్సిందే. తెలుగు క్లాసిక్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఆ సినిమా సీక్వల్ గా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.


సీనియర్ దర్శకుడు తేజ స్వాతిముత్యం సీక్వల్ కు సిద్ధమయ్యాడట. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతుందని తెలుస్తుంది. కొన్నాళ్లుగా ఫ్లాపులతో సతమతమవుతున్న తేజ రానా హీరోగా తెరకెక్కిన నేనే రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఆ తర్వాత ఎన్.టి.ఆర్ బయోపిక్ డైరక్షన్ ఛాన్స్ వచ్చినా సరే మిడిల్ డ్రాప్ అయ్యాడు.


ఇప్పుడు స్వాతిముత్యం సీక్వల్ మీద దృష్టి పెట్టాడు తేజ. కమల్ హాసన్ నటనతో పాటుగా విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభతో ఆ సినిమా గొప్ప విజయాన్ని అందుకుంది. మరి అలాంటి సినిమా సీక్వల్ తీయాలంటే చాలా గట్స్ ఉండాల్సిందే. తేజ రాసుకున్న కథ చాలా బాగా వచ్చిందని తెలుస్తుంది.


ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న సాక్ష్యం జూలై ఎండింగ్ లో రిలీజ్ అవుతుండగా తర్వాత సినిమా తేజ డైరక్షన్ లోనే ఉంటుందని తెలుస్తుంది. కాజల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఉందట. మొత్తానికి స్వాతిముత్యం లాంటి క్లాసిక్ మూవీని సీక్వల్ చేయాలన్న ఆలోచనతో తేజ వేస్తున్న ఈ క్రేజీ స్టెప్ ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: