పూరి జగన్నాథ్ ఒకప్పడూ స్టార్ డైరెక్టర్. ఇండస్ట్రీ కి ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చినాడు పోకిరి వంటి అల్ టైం సెన్సషనల్ మూవీ ని అందించాడు. అయితే ఇప్పడు ఆయన పరిస్థితి ఇప్పడు ఏమంతగా బాగాలేదని చెప్పాలి. వరుస ఫ్లాప్ ల తో డీలా పడ్డాడు. అయితే తీసిన స్టోరీ మళ్ళీ తీసి స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గా ఉండటం పూరీ సినిమాలంటే జనాలకు భయం పట్టుకున్నది. సినిమా లు ఒక పక్క ఫ్లాప్ లు అవుతున్న ఈ డైరెక్టర్ మారడం లేదు.
అయితే తన కొడుకుతో మరో సినిమా కు సిద్ధం అయ్యాడు. మొదటి సినిమా తన కొడుకు తోనే తీశాడు. ఆకాష్ తో పునర్జన్మ కాన్సెప్ట్ తో మెహబూబా సినిమా తీశాడు పూరి జగన్నాధ్. తను పూర్తిగా మారానని, తన నుంచి ఇలాంటి కథ ఊహించరని రిలీజ్ కు ముందు ఎన్నో చెప్పాడు. నిజమే, పూరి నుంచి మెహబూబా లాంటి కథను ఊహించలేం. మంచి స్టోరీనే. కానీ దాన్ని కూడా తనదైన స్టయిల్ లో చుట్టిపారేశాడు ఈ సూపర్ ఫాస్ట్ దర్శకుడు. కట్ చేస్తే, మెహబూబా డిజాస్టర్.
అలా కొడుక్కి ఓ కమర్షియల్ హిట్ ఇవ్వలేకపోయిన పూరి, ఈసారి మాస్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకున్నాడు. పక్కా మాస్ కథతో, డిఫరెంట్ మేనరిజమ్స్ తో ఆకాష్ ను సరికొత్తగా ప్రజెంట్ చేస్తానంటున్నాడు. ఎప్పట్లానే ఈ సినిమాకు కూడా తనే దర్శకత్వం, నిర్మాణ బాధ్యతల్ని తీసుకుంటున్నాడు. అంతాబాగానే ఉంది కానీ ఒకే ఒక్క విషయంలో పూరి తన మంకుపట్టు వీడడంలేదు. తను కథలు రాయడం మానేసి, బయట రచయితల నుంచి ఓ మంచి కథను ఎంచుకొని సినిమా తీస్తే బాగుంటుంది. టెంపర్ విషయంలో అదే జరిగింది. కనీసం కొడుకు విషయంలోనైనా పూరి ఈ మొండి పట్టుదల మానుకుంటే కొడుక్కి ఓ హిట్ ఇచ్చినట్టవుతుంది. తనకు కూడా డబ్బులొస్తాయి.