మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపిస్తే.. అబ్బో ఆ సినిమా రేంజ్ ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. మెగా ఫ్యాన్స్ అయితే ఆ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. చిరంజీవి, పవన్ లతో మెగా మల్టీస్టారర్ చేస్తానని సుబ్బిరామిరెడ్డి చెప్పారు.


త్రివిక్రం డైరక్షన్ లో ఆ సినిమా ఉంటుందని అప్పట్లో హడావిడి చేశారు. కాని పవన్ జనసేనతో బిజీగా ఉండటం వల్ల ఆ ఆలోచన వెనక్కి తగ్గారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ కూడా మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో సినిమా చేస్తానని అంటున్నారు.


మెగా పవర్ చాటేలా ఆ సినిమా ఉంటుందని తెలుస్తుంది. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా కరుణాకరణ్ డైరక్షన్ లో వస్తున్న తేజ్ ఐలవ్యూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ మెగా ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తూ మెగా మల్టీస్టారర్ ప్లానింగ్ లో ఉన్నట్టు వెళ్లడించారు. 


అయితే కేవలం ఫ్యాన్స్ ను ఉత్సాహపరచడానికే ఆ మాట అన్నారా లేక నిజంగానే చిరు, పవన్ సినిమా ఉంటుందా అన్న డౌట్ రేజ్ అవుతుంది. అల్లు అరవింద్ తలచుకుంటే మెగా మల్టీస్టారర్ పెద్ద కష్టమేమి కాదు. ఈ సినిమా దర్శకుడు ఎవరు.. ఎలాంటి సినిమాతో వీరు వస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.



మరింత సమాచారం తెలుసుకోండి: