తెలుగు ఇండస్ట్రీలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’ చిత్రం సెన్సేషన్ హిట్ అయ్యింది. మొదట ఈ చిత్రంపై పెద్దగా అంచనాలు లేకపోయినా..థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత మొదటి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ కి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
ఒక్క సినీ సెలబ్రెటీలే కాదు రాజకీయ నేతలు సైతం కీర్తి నటనకు ఫిదా అయ్యారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్, జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించారు, జర్నలిస్ట్ మధురవాణి పాత్రలో సమంత. ఆమె స్నేహితుడు విజయ్ ఆంటోని పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించారు. ఇక షాలినీ రెడ్డి, ప్రకాష్ రాజ్, నాగ చైతన్య తదితరులు కూడా ఈ మూవీలో మెరిశారు. మహానటి జీవిత చరిత్ర అంటే ఎంతో ఉంటుందని సినిమా కాస్త ఎక్కువగానే తీశారు.
కానీ రెండు పార్ట్ లో విడుదల చేయాలనే ఉద్దేశం లేకపోవడంతో ఈ చిత్రం నిడివి చాలా దగ్గించారు. ఇక మహానటి చిత్రం రిలీజ్ అయిన తర్వాత డిలీట్ చేసిన సన్నివేశాలు ఒక్కొక్కొటీ యూట్యూబ్ లో విడుదల చేయడం మొదలు పెట్టారు.
అయితే అంత మంచి సన్నివేశాలు చిత్రంలో లేకపోవడం పై ప్రేక్షకులు పెదవి విరిచారు. తాజాగా ఈ మూవీలోని ‘సదా నిన్ను’ సాంగ్ మ్యూజిక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ ను సితారాపై బి శివరామకృష్ణారావు వాయించారు.