సౌత్ లో క్రేజీ సినిమాలు చేసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ సోనాలి బింద్రేకి క్యాన్సర్ వ్యాధి సోకిందని ఆమె తన ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసింది. తెలుగులో మహేష్, బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించిన సోనాలి బింద్రే పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. 


చిన్న అస్వస్థత కారణంగా హాస్పిటల్ కు వెళ్తే పెద్ద జబ్బు ఉందని బయట పడిందట. అస్వస్థతకు కారణం క్యాన్సర్ అని తేలిందట. టెస్టులన్ని పాజిటివ్ గా రావడంతో సోనాలికి క్యాన్సర్ అని నిర్ధారించారట డాక్టర్లు. అయితే అది ఏ స్టేజ్ లో ఉందన్నది చెప్పలేదు. అయితే ప్రస్తుతం తను క్యాన్సర్ కు ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నట్టు చెప్పింది.


ఈ సమయంలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు గొప్ప సపోర్ట్ ఇస్తున్నారని. వారితో కలిసి క్యాన్సర్ మీద పోరాడుతున్నానని అన్నారు సోనాలి బింద్రే. నూయార్క్ లో ట్రీట్ మెంట్ ఇప్పటికే మొదలైందని తెలుస్తుండగా దాదాపు ఆమె క్షేమమగానే తిరిగి మాములు మనిషి అయ్యే పరిస్థితి ఉందా లేదా అన్నది తెలియాలి.


సోనాలి బింద్రే కు క్యాన్సర్ అనగానే ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. మురారిలో మహేష్ పక్కన నటించి అలరించిన సోనాలికి ఇలాంటి వ్యాధి సోకుతుందని ఎవరు ఊహించి ఉండరు. త్వరగా ఆమె ఈ వ్యాధి నుండి బయటపడాలని దేవుడిని ప్రార్ధిస్తున్నారు ఆమె అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: