అక్కినేని హీరో నాగచైతన్య ఇప్పడు మంచి జోరు మీద ఉన్నాడని చెప్పాలి. అయితే అక్కినేని తీసుకున్న నిర్ణయం కొంచెం షాకింగే అని చెప్పాలి. నాగచైతన్య ఇప్పటికే రెండు సినిమా లను పూర్తి చేసాడు. కానీ వాటిల్లో ఏది ఎప్పుడు విడుదల చేయాలో అర్ధం కావడం లేదు వారికి. ఎందుకంటే నాగచైతన్య ఫిక్స్ చేసిన డేట్స్ కు చాలా సినిమా లు లైన్ లో ఉన్నాయి. వాటిని తట్టుకొని నిలబడాలంటే సినిమా లో కంటెంట్ బాగా ఉండాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది.
అయితే రెండు సినిమా లను ఒకే సారి రిలీజ్ చేయడం అంటే అది రిస్క్ అనే అనుకోవాలా? లేదూ సేఫ్ గేమ్ అని భావించాలా? ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అంటే అది కచ్ఛితంగా బిగ్ రిస్క్ అనే అంటోంది బయ్యరు, పంపిణీదారు వర్గం. అలా చేయడం వల్ల ఒక సినిమా బాగా ఆడుతున్నా, రెండో సినిమా వచ్చేప్పటికి తొలిగా వచ్చిన సినిమాపై ఆడియెన్లో ఆసక్తి డ్రాప్ అవుతుందన్న లాజిక్ని వినిపిస్తున్నారు.
ఈ లాజిక్ ప్రకారం చూస్తే అక్కినేని నాగచైతన్య పెద్ద రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. అతడు నటించిన రెండు సినిమాలు ఒకే నెలలో రిలీజ్కి రెడీ అవుతున్నాయి. ఆగష్టు 17న సవ్యసాచి రిలీజవుతుంటే, ఆగష్టు 31న శైలజారెడ్డి అల్లుడు రిలీజ్కి రెడీ అవుతోందని తెలుస్తోంది. కేవలం రెండు వారాల గ్యాప్తో రెండు సినిమాలు రిలీజ్లకు వస్తున్నాయి. ఇక చైతూ సినిమాలతో పోటీపడుతూ పలు చిత్రాలు ఈ సీజన్లో రిలీజ్ కానుండడంతో పోటీ మరింత తీవ్రమవుతుందనడంలో సందేహం లేదు. అందుకే రిలీజ్ తేదీల విషయంలో పదే పదే ఆలోచిస్తారా? లేదా? అంటూ అభిమానుల్లోనూ చర్చ సాగుతోంది.