ఈటివిలో క్రేజీ డ్యాన్స్ షో ఢీ పదో సీజన్ గ్రాండ్ ఫైనల్స్ కు చేరుకుంది. శేఖర్ మాస్టర్, ప్రియమణి, అని మాస్టర్ జడ్జులుగా వ్యవహరించే ఈ డ్యాన్స్ షోలో సుధీర్, రష్మిలు కంటెస్టంట్స్ కు మెంటర్స్ గా చేస్తున్నారు. ప్రదీప్ యాంకరింగ్ లో ఓ పక్క డ్యాన్స్ మజా.. మరోపక్క కామెడీ కిక్ అందిస్తున్న ఢీ-10 కూడా ఆడియెన్స్ ను బాగా అలరిస్తుంది.     


ఇక ఈ షో ఫైనల్స్ కు ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ వస్తున్నాడు. ఈ ప్రోమో బాగా కట్ చేశారు. సింహాల మధ్య సింహాద్రిగా యంగ్ టైగర్ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఎన్.టి.ఆర్ రాకతో ఢీ-10 కలర్ ఫుల్ గా మారింది. ఇక ఈమధ్య మిగతా స్టార్స్ తో కలివిడిగా ఉంటున్న తారక్ ఢీ-10 వేదిక మీద చరణ్, మహేష్ లతో తారక్ దిగిన పిక్ చూపించి అలరించారు.  


స్టార్ హీరోల అభిమానులు తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అన్న ఆలోచన మానిపించి అందరిని అందరు అభిమానించేలా స్టార్స్ ప్రయత్నిస్తున్నారు. ఇక ఢీ-10 ఫైనల్ విన్నర్ కు ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా షీల్డ్ ఇవ్వనున్నారు. ఫైనల్స్ లో రాజు, ప్రదీప్, ఐశ్వర్య, ముకుల్ పాల్గొంటున్నారు. 


వీరిలో ఎవరు ఫైనల్ విన్నర్ అవుతారో చూడాలి. ఆల్రెడీ షూటింగ్ జరుపుకున్న ఈ ఎపిసోడ్ నుండి బయటకు వచ్చిన సమాచారం ప్రకారం చిట్టి మాస్టర్ కంటెస్టంట్ రాజు ఈసారి టైటిల్ కొట్టినట్టు తెలుస్తుంది. సో రాజు ఎన్.టి.ఆర్ చేతుల మీదుగా ఢీ-10 టైటిల్ తీసుకోబోతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: