తెలుగు చిత్ర పరిశ్రమలో హాస్యనటిగా తనదైన ముద్ర వేసుకున్న నటి విద్యుల్లేఖ ఫేస్బుక్ అకౌంట్ను కొందరు హ్యాక్ చేశారు. ఆమె అఫీషియల్ ఫేస్బుక్ హ్యాకింగ్కు గురైంది. విద్యు ఫేస్బుక్ పేజీ మొత్తాన్ని ఫోటోలతోసహా మార్చేసిన హ్యాకర్లు.. రమ్య అనే పేరుతో ఫోటోలు, సమాచారాన్ని అప్లోడ్ చేశారు. దీంతో కంగారుపడిన ఆమె ట్విటర్లో విషయాన్ని తెలియజేశారు.
‘‘నా ఫేస్బుక్ పేజీ వ్యవహారాలన్నీ నేనే చేసుకుంటున్నా. కానీ ఈ ఊహించని సంఘటన ఎలా జరిగిందో అర్థం కావటం లేదు. ఈ పరిస్థితిలో ఫేస్బుక్ వారే ఏదో ఒకటి చేయాలి. కొద్దిసేపట్లో సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేస్తా’’ అని ట్వీట్లో పేర్కొంది. వెరిఫైడ్ అకౌంట్ హ్యాక్ కావటమేంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, తక్షణమే జోక్యం చేసుకోని అకౌంట్ పునరుద్ధించాలని ఆమె ఫేస్బుక్కు విజ్ఞప్తి చేశారు.
తన పేజీని తానే నిర్వహించుకుంటున్నా ఇదెలా జరిగిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఖాతా హ్యాక్కు గురైన విషయమై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపింది.