నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 షో రసవత్తరంగా సాగుతోంది. 100 రోజుల పాటు ఆడియన్స్ కు వినోదాన్ని పంచనున్న బిగ్ బాస్ హౌస్.. సినిమా ప్రమోషన్లకు అడ్డాగా మారిపోయింది. ‘ఏమైనా జరగొచ్చు.. ఇంకొంచెం మసాలా’ అంటూ నాని చెప్పిన డైలాగ్‌లు నిజమవుతున్నట్టే కనిపిస్తోంది.  కనిపిస్తోంది. తేజస్వీ, సామ్రాట్‌ మధ్య ఏదో జరుగుతోందని, తనీష్‌, దీప్తి సునయనల విషయంపై బిగ్‌బాస్‌ క్లాస్‌ పీకాడంటూ ఇచ్చిన సీక్రెట్‌ టాస్క్‌లో భాగంగా రక్తికడుతున్న నాటకం కూడా హైలెట్‌గా నిలిచింది.

ఇంటి నియమాలను పాటించకుండా అందరి దగ్గరా నామినేషన్‌కు సంబంధించిన విషయాలను ప్రసంగిస్తోందంటూ గీతా మాధురిని బిగ్‌బాస్‌ జైల్లో వేయడం కూడా జరిగింది. ఇక బిగ్ బాస్ హౌజ్ లో సినీ తారల సందడి కూడా నెలకొంటుంది. ఆ మధ్యన జంబలకడి పంబ చిత్ర యూనిట్ బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసిన సంగతి తెలిసిందే. తేజ్ ఐ లవ్ యు చిత్రం శుక్రవారం విడుదలవుతున్న నేపథ్యంలో సాయిధరమ్ తేజ, అనుపమ పరమేశ్వరన్ బిగ్ బాస్ హౌస్‌లో సందడి చేశారు.
నీకు నేనే ఎక్కువ
దానికి సంబంధించిన ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. దానికి సంబందించి ప్రోమోని విడుదల చేశారు. వీరితో కలిసి హౌజ్‌మేట్స్‌ చేసే సందడి హైలెట్‌గా నిలవనుంది. తేజస్వీ.. ‘నా బర్త్‌డేకు కేక్‌ తీసుకురాలేదా బావా?’ అని అంటే.. తేజ్‌ ‘నేను రావడమే ఎక్కువ ఇంకా కేక్‌ కూడానా?’ అని​ బదులివ్వడం బాగానే పేలింది.

సామ్రాట్‌ను ఉద్దేశించి... బౌలింగ్‌ కూడా బాగానే వేస్తున్నావట అని అనడం.. తనీష్‌ను ఉద్దేశించి వేసిన పంచ్‌లు వీడియోలో ఉన్నాయి. అనుపమా పాట పాడటం..బిగ్ బాస్ హౌజ్ నుంచి సాయిధరమ్, అనుపమ వెళ్తుంటే బాధగా వీడ్కోలు చెప్పడంతో బిగ్ బాస్ లో మంచి ఎంట్రటైన్ మెంట్ గా ఉండబోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: