తెలుగు ఇండస్ట్రీలో కామెడియన్స్ కి కొదవేలేదు. ఎంత మంది కమెడియన్స్ వచ్చినా..ఎప్పుడూ కొత్తదనమే ఉంటుంది. టాలీవుడ్ లో ఉన్నంత మంది కమెడియన్స్ ఏ ఇండస్ట్రీలో లేరని అంటారు. కామెడిన్లు గా ఉంటూనే కొంత మంది హీరోలుగా నటిస్తున్నారు. ఒకప్పుడు బ్రహ్మానందం, ఆలీ హీరోలుగా వచ్చి కమెడియన్లుగా కంటిన్యూ అవుతున్నారు. ఈ మద్య శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి రీసెంట్ గా షకలక శంకర్ కూడా శంభో శంకర చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక తెలుగు ఇండస్ట్రీలో ‘హృదయకాలేయం’ చిత్రంతో కామెడీ సెన్సేషన్ క్రియేట్ చేశాడు సంపూర్ణేశ్ బాబు.
ఇండస్ట్రీలో ఎవరూ ఇవ్వకుండానే తనకు తానే బర్నింగ్ స్టార్ అని బిరుదుతో అప్పట్లో సంపూ చేసిన సందడి అంతా ఇంతా కాదు. మొత్తానికి హృదయాకాలేయం చిత్రం కామెడీతో యావరేజ్ గా నడిచింది. ఆ తర్వాత సింగం 123 తో వచ్చాడు..ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని చిత్రాల్లో నటించినా..అడపా దడపా హీరోగా నటిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం సంపూర్ణేష్ ‘కొబ్బరిమట్ట’ చిత్రం రిలీజ్ కి రెడీగా ఉంది. కామెడీ హీరో సంపూర్ణేష్ బాబు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. జేజే ప్రకాష్ డైరెక్షన్లో సంపూ ఓ సినిమా చేస్తున్నాడు.
‘మర్యాద రామన్న’ ఫేమ్ సలోనీ ఈ మూవీలో నటించనుంది. ఈ సినిమాకు సంపూ మహేష్ బాబు మూవీ టైటిల్ను వాడేశాడు. ఆర్కే ఫిల్మ్ ఫ్యాక్టరీస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి ‘టక్కరి దొంగ చక్కని చుక్క’ అనే పేరు ఖరారు చేశారు. అలీతో కలిసి అల్లరి పెళ్లికొడుకు చిత్రాన్ని తెరకెక్కించిన ప్రకాష్.. కామెడీ, రొమాన్స్, డ్రామా కలబోతగా సంపూతో సినిమా తీయబోతున్నాడు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ చిత్రం జూలై రెండో వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది.