టాలీవుడ్ లో సందీప్ వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలినీ పాండే నటించిన ‘అర్జున్ రెడ్డి’ ఎంతో గొప్ప విజయం సాధించింది. విజయ్ దేవరకొండకు ‘అర్జున్ రెడ్డి’మూడవ సినిమా అయినా..స్టార్ హీరోకి వచ్చినంత ఇమేజ్ వచ్చింది. హీరోహీరోయిన్లుగా నటించిన విజయ్, షాలినీ తమ పాత్రలకు ప్రాణం పోశారు. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ‘అర్జున్ రెడ్డి’ మొదట ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించింది. ఒకదశలో ఈ సినిమా నిలిపి వేయాలని కొంత మంది పెద్ద ఎత్తున గొడవ కూడా చేశారు.
ఈ సినిమాలో లిప్ లాక్ పోస్టర్ పై అభ్యరంతరాలు కూడా తెలిపారు. కొన్ని డైలాగ్స్ వల్గర్ గా ఉన్నాయని అవి తొలగించాలని డిమాండ్ చేశారు. ఏది ఏమైనా ‘అర్జున్ రెడ్డి’ థియేటర్లో చేసిన హంగామా అంతా ఇంతా కాదు..అంచనాలకు మించి సినిమా హిట్ కావడమే కాదు..భారీగా కలెక్షన్లు కూడా సాధించింది. ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లో కూడా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాను తమళంలో `వర్మ` పేరుతో రీమేక్ చేస్తున్నారు.హీరో విక్రమ్ కొడుకు ధృవ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అయింది. కాకపోతే హీరోయిన్ మాత్రం ఇప్పటి వరకు సెలక్ట్ కాలేదు. కవైపు హీరోతో షూటింగ్ జరుపుతూనే హీరోయిన్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా వీరి నిరీక్షణ ఫలించింది. కోల్కతాకు చెందిన మేఘ చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఎంతోమందిని పరిశీలించి చివరికి మేఘను ఎంపిక చేసినట్టు హీరో విక్రమ్ తెలిపాడు. ప్రస్తుతం మేఘ కూడా ప్రత్యేకంగా శిక్షణ తీసుకోతున్నట్లు సమాచారం.