మాటల మాంత్రికుడు త్రివిక్రం పవన్, మహేష్ తర్వాత రెండు సినిమాలు తీసిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే. త్రివిక్రం డైరక్షన్ లో బన్ని హీరోగా జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చి ప్రేక్షకుల మెప్పుపొందాయి. మళ్లీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారట.


ప్రస్తుతం త్రివిక్రం ఎన్.టి.ఆర్ హీరోగా అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత బన్నితోనే సినిమా మొదలుపెడతారని తెలుస్తుంది. ఇప్పటికే అల్లు అర్జున్ కు ఓ లైన్ చెప్పడం దానికి అతను ఓకే చెప్పడం జరిగిందట. అరవింద సమేత అక్టోబర్ లో రిలీజ్ అవనుంది. ఆ తర్వాత వెంటనే బన్ని సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారట.


డివివి దానయ్య ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. నా పేరు సూర్య అంచనాలను అందుకోలేదు కాబట్టి ఈసారి బన్ని పక్కా హిట్ సబ్జెక్ట్ పై గురి పెట్టాడు. అందుకే త్రివిక్రం తో చేతులు కలిపాడు. అయితే త్రివిక్రం పవన్ తో తీసిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు హిట్ అవగా అజ్ఞాతవాసి ఫ్లాప్ అయ్యింది.


ఆ సెంటిమెంట్ ప్రకారం జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు హిట్ కొట్టగా మూడవ సినిమా వీరికి హిట్ ఇస్తుందా అంటూ డౌట్లు పెంచుతున్నారు మెగా ఫ్యాన్స్. ఏది ఏమైనా బన్నితో త్రివిక్రం కాంబో ఫిక్స్ అయితే మరో క్రేజీ మూవీ తెలుగు ప్రేక్షకులకు అందించే అవకాశం ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: