ఆ మద్య తెలుగు, తమిళ భాషల్లో మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ నటుడు సూర్య, మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ కలిసి కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లండన్లో చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా గురించి రోజుకొక న్యూస్ బయటకు వస్తోంది. సూర్య 37’ వర్కింగ్ టైటిల్తో యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాలో మెగా అల్లుడు అల్లు శిరీష్ కూడా నటిస్తున్నాడు. ఇక సాయేషా సైగల్, బొమన్ ఇరానీ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో..అంటే ఈ హీరోలకు విలన్ గా మరో హీరో నటించబోతున్నాడు. ఇటీవల ఆర్య లండన్లో దర్శనమివ్వడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అయితే, దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా ఇవ్వలేదు.
ఆర్య గతంలో అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘వరుడు’ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పాత్రల విషయంలో కేవీ ఆనంద్ చాలా గోప్యత పాటిస్తున్నారు. ప్రస్తుతం లండన్లో చిత్రీకరణ జరుపుకొంటున్న ‘సూర్య 37’ఆ తర్వాత దాదాపు పది దేశాల్లో షూటింగ్ జరుపుకోనుంది.
ఆ తర్వాత న్యూయార్క్, బ్రెజిల్, ఇంగ్లాండ్, సహా, హైదరాబాద్, దిల్లీ నగరాల్లో కూడా పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని నవంబర్ నాటికి రిలీజ్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.