‘మిణుగురులు’ లాంటి ఉత్తమ చిత్రాన్ని తీసి జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్న అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి హేబా పటేల్ ను లీడ్ హీరోయిన్ గా చేసి తీసిన ’24 కిసెస్’ మూవీలో కొన్ని సంచలనాలు ఉంటాయి అన్న ప్రచారం జరుగుతోంది. అధిత్ అరుణ్ హీరోగా నటిస్తున్న ఈమూవీ కథ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 
హెబ్బాపటేల్ కొత్త మూవీ డిటైల్స్
ఈసినిమాకు సంబంధించిన టీజర్ ఈరోజు విడుదల కాబోతోంది అంటూ ఈమూవీ దర్శక నిర్మాతలు నిన్నటి నుంచి మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ వార్తలను ప్రచారం చేస్తూ రూపొందించిన పోస్టర్ కూడ చాల డిఫరెంట్ గా ఉండటంతో ఈరోజు విడుదల కాబోతున్న ఈమూవీ టీజర్ లో ఏముంటుంది అన్న ఆత్రుతను యూత్ లో క్రియేట్ చేయగలగారు. 
'Sri Lakshmi & 24 Kisses' revived with Hebbah Patel
ఒక సామాజిక సమస్య పై ‘మిణుగురులు’ తీసిన అయోధ్య కుమార్ ‘కుమారి 21 ఎఫ్’ ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుని ఇప్పుడు పూర్తిగా క్రేజ్ కోల్పోయిన హేబాను ఈసినిమాలో డిఫరెంట్ గా చూపెట్టపోతున్నాడని అంచనాలు అందుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో బూతు కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అని టాక్. 
హెబ్బాకి ఆ సెంటిమెంట్ క‌లిసి రాలేదు
ఈమూవీకి సంబంధించి అదిత్ హెబ్బాలు రొమాంటిక్ మూడ్ లో ఉన్న సన్నివేశాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ బట్టి ఈమూవీలో హాట్ కంటెంట్ ఉండబోతోంది అన్న సంకేతాలు ఇస్తున్నాడు దర్శకుడు. అనేక అంతర్జాతీయ చలన చిత్ర ఫెస్టివల్స్ లో ప్రదర్శింపబడ్డ ‘మిణుగురులు’ ద్వారా అనేక అవార్దులు అందుకున్న అయోధ్య కుమార్ ఇలా రూట్ మార్చడం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: