మాటల మాంత్రికుడు త్రివిక్రం అంటే టాలీవుడ్ లో ఓ మార్క్ ఏర్పడింది. తెలిసిన కథలనే.. తెలిసిన పాత్రల ద్వాతా మనసుకి హత్తుకునేలా చెప్పే మాటలను చెబుతూ మనసులను కదిలిస్తాడు. అయితే పవన్ తో తీసిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు త్రివిక్రం రేంజ్ పెంచాయి. అఫ్కోర్స్ మహేష్ తో అతడు, ఖలేజా కూడా త్రివిక్రం టాలెంట్ చూపించాయనుకోండి.


ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు త్రివిక్రం శ్రీనివాస్. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఆ సినిమా వస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత పవన్ తో రుస్తుం సినిమా ఉంటుందని త్రివిక్రం చెబుతున్నాడు. అజ్ఞాతవాసి తర్వాత పవన్, త్రివిక్రం ల మధ్య మ్యాటర్ చెడిందని టాక్.  


బయట మాత్రం పవన్, త్రివిక్రం లు ఎప్పటిలానే ఉన్నారని అంటుండగా.. ఇన్నర్ టాక్ మాత్రం ఇద్దరు చెరోదారి చూసుకున్నారని అంటున్నారు. వారిద్దరి మధ్య ఉండే క్లోజ్ సర్కిల్స్ చెబుతున్న వార్తల ప్రకారం పవన్ తో త్రివిక్రం కలిసి పనిచేయడం కుదరని పని అంటున్నారు.   


ఏది ఏమైనా త్రివిక్రం, పవన్ కు కుదిరినట్టు ఇంకా ఎవరికి సెట్ అవదు. మహేష్, బన్ని లతో సినిమాలు చేసినా త్రివిక్రం కథకు పవన్ మాత్రమే న్యాయం చేస్తాడని ఫ్యాన్స్ నమ్మకం. మరి రుస్తుం కేవలం పవన్ కోసమే రాశానని చెబుతున్న త్రివిక్రం ఆయనతో సినిమా తీస్తారా లేక ఆ కథను అలానే అటకెక్కిస్తారా అన్నది చూడాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: