బ్రహ్మోత్సవం, స్పైడర్ డిజాస్టర్స్ తర్వాత మహేష్ కెరియర్ లో చాలా హిట్ అవసరం అనుకున్న టైంలోనే భరత్ అనే నేను సూపర్ హిట్ అయ్యింది. కొరటాల శివ డైరక్షన్ లో వచ్చిన భరత్ అనే నేను శ్రీమంతుడు తర్వాత మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత మహేష్ 25వ సినిమా చేస్తున్నాడు. 


వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మహేష్ మరింత జాగ్రత్త పడుతున్నాడు. అయితే సినిమా షూటింగ్ స్పీడ్ స్పీడ్ గా కానిచ్చేస్తున్నారు. సినిమా త్వరగా పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనా లేక బడ్జెట్ కంట్రోలింగ్ కారణమో తెలియదు కాని సినిమా చుట్టేస్తున్నారన్న టాక్ వచ్చింది.


అలా చేస్తే మళ్లీ మహేష్ రిస్క్ లో పడినట్టే అవుతుంది. శ్రీమంతుడు తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా హిట్ ఇచ్చాడని శ్రీకాంత్ అడ్డాల మీద నమ్మకంతో బ్లైండ్ వెళ్లిపోయాడు మహేష్ కాని బ్రహ్మోత్సవం మహేష్ ఇమేజ్ ను దెబ్బతీసింది. ఆ తర్వాత క్రేజీ కాంబినేషన్ లో మురుగదాస్ తో తీసిన స్పైడర్ కూడా నిరాశపరచింది.  


భరత్ అంచనాలతో రాగా ఆ అంచనాలను సైతం అందుకుంది. అయితే మహేష్ 25వ సినిమాపై కూడా అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అశ్వనిదత్ తో మహేస్ చివరి సారిగా చేసిన సైనుకుడు ఫ్లాప్ మరి ఈ లెక్కలన్ని మహేష్ మరోసారి బ్లండర్ మిస్టేక్ చేశాడని అంటున్నారు. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. రాజ్సం టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: