తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘బద్రి’ చిత్రంలో జంటగా నటించిన రేణు దేశాయ్, పవన్ కళ్యాన్ రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారు.  పెద్దల సమక్షంలో పెళ్లి కూడా చేసుకున్నారు.  వీరికి ఇద్దరు పిల్లలు అఖిరానందన్, ఆద్యా.  కొంత కాలం తర్వాత వీరి మద్య మనస్పర్ధలు వచ్చాయని..అందుకే చట్టపరంగా విడాకులు తీసుకున్నారు.  విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ ఇద్దరు పిల్లలతో పూణే వెళ్లిపోయింది. ఇక పవన్ కళ్యాన్ మరో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 
Related image
ప్రస్తుతం హీరో నటిస్తూనే..‘జనసేన’ పార్టీ తరుపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు.  ఈ మద్య రేణు దేశాయ్ నిశ్చితార్థం చేసుకుంది.  ఆమె ద్వితీయ వివాహం చేసుకోవొద్దని కొంత మంది సోషల్ మాద్యమాల్లో ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.  రేణు దేశాయ్ .. పవన్ కల్యాణ్ విడిపోయి చాలాకాలమే అయింది. అయితే ఈ ఇద్దరిలో ఎవరు విడాకులు కోరారనే  విషయాన్ని మాత్రం ఇద్దరూ కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. 


తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న రేణు దేశాయ్ కి ఎదురైంది. అందుకామె స్పందిస్తూ ..." ఇంతకాలం చాలా ఇంటర్వ్యూస్ లో ఈ ప్రశ్న ఎదురైనా నేను ఎక్కడా సమాధానం చెప్పలేదు. కానీ ఇప్పుడు నాకు మరొకరితో పెళ్లి ఫిక్స్ అయింది కనుక చెప్పవచ్చని అనుకుంటున్నాను.  నేను ఏ ఇంటికైతే కోడలిగా వెళుతున్నా అందుకే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉందని రేణు దేశాయ్ అన్నారు. ఇంటర్వ్యూలో 'నీ తప్పులేనప్పుడు నిజం చెప్పడానికి ఎందుకు ఆలోచించడం?' అని వాళ్లు నన్ను అడిగారు.
Image result for renu desai pawan
అందుకే ఈ సారి నిజం చెప్పేయాలని నిర్ణయించుకున్నాను. విడాకులు నేను అడగలేదు .. ఈ విషయం కల్యాణ్ గారికి తెలుసు .. దేవుడికి తెలుసు. విడాకుల ప్రస్తావన వచ్చినప్పుడు భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవ జరుగుతుందో .. అదే మా మధ్య జరిగింది. ఆయనకే విడాకులు కావాలి .. ఆయనే అడిగారు .. ఈ విషయాన్ని చెప్పడానికి కూడా నాకు చాలా బాధగా వుంది" అంటూ ఇబ్బంది పడ్డారు.     


మరింత సమాచారం తెలుసుకోండి: