ఈ మాటలు అంటుంది ఎవరో కాదు నటి మాధవీలత.  ఈ మద్య కత్తి మహేష్ రామాయణం, రాముడు-సీతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రచ్చ రచ్చ అవుతుంది.  తాజాగా  సీతారాములు, రామాయణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ పై బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి మాధవీలత మండిపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘బీజేపీ తరపున కంటే ముందుగా ఒక అమ్మాయిగా నేను మాట్లాడుతున్నా.
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో
కత్తి మహేశ్ చేసిన కామెంట్స్ ను పూర్తిగా ఖండిస్తున్నా. ‘ఒకవేళ సీత కనుక రావణుడి దగ్గర ఉండి ఉంటే ఎంజాయ్ చేసేదేమో’ అని కత్తి మహేశ్ అన్నారు.  ఒకవేళ ముస్లిం, క్రిస్టియన్, ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే పరిస్థితి మారోలా ఉండేది అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ చరిత్రలో తరాలు, యుగాలు మారినా ఇప్పటికీ మహాసాధ్వీ సీతమ్మనే భారతీయ మహిళలు స్ఫూర్తిగా తీసుకొంటారు.
Image result for katti mahesh
రావణుడి దగ్గర ఉండాలి అని అనడానికి వీడు ఎవడు? (కత్తి మహేష్) అని మాధవీ లత ఫైర్ అయ్యారు. సీతమ్మ ఎక్కడ ఉండాలని నిర్ణయించడానికి వీడెవ్వడూ అని తీవ్రంగా స్పందించారు. మహేష్ కత్తి చేసే దుర్మార్గాలను భరించలేకనే ఆయన భార్య వదిలేసి వెళ్లింది. అలాంటి వ్యక్తి హిందు దేవుళ్లపై, సీతమ్మపై వ్యాఖ్యాలు చేస్తారా? రామాయణాన్ని కథగా భావిస్తే ఆయన వ్యక్తిగతం.. కానీ పబ్లిక్‌గా మాట్లాడటం సరికాదు.
కత్తి మహేష్‌ని చెప్పుతో కొడుతా
ఎన్నో తరాలు రామాయణాన్ని గౌరవిస్తూ వస్తుంటే ఇప్పుడు వీరు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నాడు.వాడి భార్య ఆయనను వదిలేసి వెళ్లింది. వీడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో తెలుసు. ఇలాంటి దుర్మార్గుడి ఉండలేకనే కత్తి భార్య వెళ్లిపోయారు. ఇంకా లీగల్‌గా డైవోర్స్ కూడా తీసుకోలేదు. మహిళకు గౌరవం ఇవ్వలేదనే కారణంతోనే దూరంగా ఉంటున్నారు. ఇలాంటి వ్యక్తి పురాణాలు, సీతమ్మపై అనుచిత వ్యాఖ్యలు చేస్తారా? అని మాధవి లత దుయ్యబట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: