తెలుగు సినిమా తెరపై ఇప్పటి వరకు ఎంతోమంది కమెడియన్లు వస్తున్నారు.  అయితే కొంత మంది కమెడియన్లు హీరోలుగా మారుతున్నారు.  ఒకప్పుడు రాజబాబు, పద్మనాభం,చలం లాంటి కమెడియన్లు హీలుగా చేశారు.  ఆ మద్య బ్రహ్మానందం, ఆలీ కమెడియన్లుగానే నటిస్తూ హీరోలుగా కొన్ని సినిమాల్లో చేశారు.  ప్రస్తుతం వారు కమెడియన్లగానే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘స్వయంవరం’ లాంటి సినిమాలో తనదైన కామెడీ మార్క్ చాటుకున్న సునీల్ ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారాడు.   
Related image
హీరోగా కనిపించడానికి ఆయన సిక్స్ ప్యాక్స్ మెయింటేన్ చేశాడు.  స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన సునీల్ తనదైన టైమింగ్ తో మంచి హీరోగా సెటిల్ అవుతున్న క్రమంలో గత కొంత కాలంగా వరుసగా ఫ్లాపులు ఆయన కెరీర్ ని ఆలోచనలో పడేసింది.  అయితే హీరోగా మారిన తర్వాత సునీల్ మళ్లీ కమెడియన్ పాత్రల్లో నటించలేదు.  ఈ నేపథ్యంలో ఆయన తిరిగి కమెడియన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతే వరుస అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయి.
Related image
శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలో సునీల్ కమెడియన్ గా చేస్తున్నాడు. ఇక శర్వానంద్ తాజా చిత్రంలోను కమెడియన్ గా సునీల్ సందడి చేయనున్నాడు. తాజాగా సునీల్ మరో సినిమాకి ఓకే చెప్పాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల ఒక సినిమా చేయనున్నాడు.  'చిత్రలహరి' .. బార్ అండ్ రెస్టారెంట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరో స్నేహితుడి పాత్ర కోసం సునీల్ ను తీసుకున్నట్టుగా సమాచారం. మొత్తానికి కమెడియన్ గా సునీల్ మళ్లీ బిజీ అవుతున్నాడన్న మాట.


మరింత సమాచారం తెలుసుకోండి: