ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే సినీ తారలపైనే కాకుండా రాజకీయ, క్రీడా నేపథ్యంలో కూడా బయోపిక్ లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మ డి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ప్రజల మన్నలు పొందిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కిస్తున్నాు. జననేత, ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’. రాజశేఖరరెడ్డి పాత్రను ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి పోషిస్తున్నారు.
ఈ ఏడాది జూన్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. వైఎస్సార్ చేపట్టిన ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్రను కథాంశంగా తీసుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు ఇప్పటికే దర్శక నిర్మాతలు ప్రకటించారు. అందుకే ‘యాత్ర’ అనే టైటిల్ను పెట్టామని కూడా చెప్పారు. టాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న బయోపిక్స్లో యాత్ర ఒకటి. 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది. నేడు వైఎస్ఆర్ జయంతని పురస్కరించుకొని యాత్ర టీజర్ విడుదల చేశారు. ఇందులోని డైలాగ్స్ అభిమానులని అలరిస్తున్నాయి. పాదయాత్రకి బయలు దేరేముందు సన్నివేశాలని టీజర్లో అద్భుతంగా చూపించారు.
వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసిన దర్శకుడు, వైఎస్ పర్సనల్ అసిస్టెంట్ సూరీడు పాత్ర కోసం పోసాని కృష్ణ మురళి, షర్మిళ పాత్ర కోసం భూమిక, సబితా ఇంద్రా రెడ్డి పాత్ర కోసం సుహాసినిని సెలక్ట్ చేసినట్టు టాక్. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’అనే ట్యాగ్ లైన్తో వస్తున్న ఈ సినిమాలో ప్రజా ప్రస్థానం పాదయాత్రను ముఖ్యంగా చూపించనున్నారని సమాచారం.