తెలుగులో వస్తున్న బిగ్ బాస్ 2 సీజన్  ప్రారంభంలో పెద్దగా ఆసక్తిగా లేకపోయినా..రెండో వారం నుంచి కాస్త ఆసక్తి  పెరుగుతుంది.  క్రమక్రమంగా బుల్లితెరపై ఫేమస్ అవుతున్న టాలీవుడ్ బిగ్ బాస్, సీజన్ 2 లో ఇప్పటి రెండు మూడు వివాదాలతో నడుస్తుంది.  ఆ మద్య నూతన్ నాయుడు, కౌశిక్ మద్య గొడవ..తర్వాత తేజస్వితో కొంత మంది బిగ్ బాస్ హౌజ్ సభ్యులకు గొడవ..ఇలా రోజు రోజుకీ క్యూరియాసిటీ పెంచుతుంది.  తాజాగా బిగ్ బాస్ కి సంబంధించి మరో వివాదం సంచలనం రేపుతుంది. వారానికి ఒకరు ఎలిమినేట్ అవుతున్న ఈ షో... లైవ్ కాదని, ముందుగా రికార్డు చేసిన కార్యక్రమాన్ని వదులుతున్నారని చెప్పే సాక్ష్యాలు ఇప్పుడు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
Syamala in Bigg Boss Telugu 2 house
తొలి వారంలో సంజన, రెండో వారంలో నూతన్ నాయుడు, మూడో వారంలో కిరీటి దామరాజు ఎలిమినేట్ కాగా, నాలుగో వారంలో ఎవరు బయటకు వచ్చారో, కార్యక్రమం ప్రసారం కాకముందే తెలిసిపోయింది.   అదేంటీ ఎలిమినేషన్ రౌండ్ పూర్తికాకుండానే బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నవారికి సంబంధించి  ఎలా లీక్ అయ్యిందని అనుకుంటున్నారా..! ఇప్పటికే హౌస్ నుంచి బయటకు వచ్చేసిన శ్యామల, తనకు మద్దతుగా నిలిచిన ప్రేక్షకులకు కృతజ్ఞతలని, తాను హౌస్ ను వీడి వచ్చానని చెబుతూ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది.
Image result for big boss 2 telugu shyamala
ప్రస్తుతం తన కొడుకు ఇషాన్ తో ఆడుకుంటున్నానని చెప్పింది.  అంతే ఒక్కపోస్ట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. లీక్ చేయకూడని విషయాన్ని శ్యామల లీక్ చేయడంతో బిగ్ బాస్ యాజమాన్యం, స్టార్ మా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, ఆమె తన పోస్టును డిలీట్ చేసినప్పటికీ, అప్పటికే ఆ స్క్రీన్ షాట్స్ వైరల్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: