పవన్‌ రేణు దేశాయ్ లు విడిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ ఎవరికీ స్పష్టంగా తెలియకపోయినా నిన్న ఒకప్రముఖ ఇంగ్లీష్ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ తన పవన్ తో విడిపోవడానికి గల కారణాలను వివరించింది. తాను డైవర్స్ కోరుకోలేదని ముందుగా పవన్ కళ్యాణ్ తన నుంచి డైవర్స్ కావాలని అడిగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
అందుకే ఇంత రహస్యంగా...
అంతేకాదు దాదాపు 8 సంవత్సరాల మానసిక వ్యథ తరువాత తాను మళ్ళీ పెళ్ళి చేసుకోబోతున్న సంగతి వివరిస్తూ తమ పెళ్లి డిసెంబర్ నెలలో కోయంబత్తూర్ లోని ‘ఇషా’ సెంటర్ కు సంబంధించిన ‘లింగ భైరవీ’ ఆలయంలో జరగబోతున్న విషయాన్ని వివరిస్తూ తమ పెళ్లి చాల సింపుల్ గా జరుగుతుందని వివరించింది రేణు. అంతేకాదు తమ పెళ్లి తరువాత కోయంబత్తూర్ లోని ఒక అనాధాశ్రయములో అన్నదానం చేస్తాము అన్న తన వెడ్డింగ్ ప్లాన్స్ ను బయటపెట్టింది.  
వారు చెప్పడంతో రెండో పెళ్లి గురించి ఆలోచించా
ఇక తన కాబోయే భర్త గురించి మాట్లాడుతూ అతడు తన పిల్లలతో చాల అభిమానంగా ఉంటాడని దీనితో తన పిల్లల భవిష్యత్ గురించి తనకు ఎటువంటి భయంలేదు అన్న ఆసక్తికర కామెంట్స్ చేసింది. గతంలో తాను పవన్ ను పెళ్లి చేసుకున్నప్పుడు గ్రాండ్ గా మెహందీ కార్యక్రమం ఏర్పాటు చేసుకుందామని కోరుకున్నా దానికి పవన్ అంగీకరించలేదు అన్న విషయాన్ని వివరిస్తూ తన చిన్నచిన్న కోరికలను ఈ పెళ్ళి ద్వారా తాను తీర్చుకోబోతున్నాను అన్న అభిప్రాయాలను వ్యక్తం చేసింది రేణు.
ఇక తన కొడుకు అకిరా నందన్ గురించి మాట్లాడుతూ అతడికి సినిమాలు అంటే ఏమాత్రం ఇష్టం లేదు అని చెపుతూ భవిష్యత్ లో అకిరా రచయితగా మారాలని ప్రయత్నిస్తున్న విషయాన్ని వివరించింది.
కళ్యాణ్ గారి నుండి కరెక్ట్ స్టేట్మెంట్ వస్తే ఇలా ఉండేది కాదు
ఇదే సందర్భంలో పవన్ అభిమానులు తన పై చేస్తున్న మాటల దాడి గురించి మాట్లాడుతూ తామిద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాము అన్న విషయాన్ని తన అభిమానులకు ఓపెన్ ప్రెస్ స్టేట్ మెంట్ ఇచ్చి తన అభిమానులకు తెలియచేయమని తాను పవన్ ను కోరినా పవన్ ఆవిషయంలో సహకరించలేదు అన్న విషయాన్ని బయటపెట్టింది. పవన్ తో విడిపోయిన తరువాత గత ఎనిమిది సంవత్సరాలుగా తాను పడిన బాథ మరెవ్వరికీ ఉండకూడదు అంటూ రేణు కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. అందరు ముఖ్యంగా పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రేణు దేశాయ్ వెడ్డింగ్ ప్లాన్ బయటపడటంతో ఇప్పుడు ఈ న్యూస్ హాట్ న్యూస్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: