తెలుగు తెరపై పది సంవత్సరాల విరామం తర్వాత ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సంచలనం సృష్టించిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమాలో అన్ని భాషల నటులు నటిస్తున్నారు.  బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్..తమిళ నటుడు విజయ్ సేతుపతి...ఇప్పుడు కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ని తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


 తనకు సినిమా అనేది ఎప్పటికప్పుడు సర్ప్రైజ్‌లు ఇస్తూనే ఉందని.. ఇప్పుడు అలాంటి సర్ప్రైజే మరొకటి వచ్చిందని.. లెజెండ్ చిరంజీవి సార్‌తో ‘సైరా’లో స్క్రీన్ పంచుకునే అవకాశం దక్కిందని..  సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పని చేయబోతున్నానని.. తన జీవితంలో ఇదే తొలి చారిత్రక సినిమా అని ట్వీట్ చేశాడు సుదీప్. అంతా అయ్యాక తనకు చాలా ఎగ్జైటెడ్‌గా ఉందని చెబుతూ.. అలాగే ఆందోళనగా కూడా ఉందని అన్నాడు సుదీప్.

Image result for KICCHA SUDEEP

 ఐతే తెలుగులో చేసిన తొలి సినిమా ‘ఈగ’తోనే మెస్మరైజ్ చేసిన సుదీప్.. ‘సైరా’లో కూడా అదరగొట్టేస్తాడని భావిస్తున్నారు. ‘ఈగ’ తర్వాత అంతగా ప్రాధాన్యం లేదని రెండు మూడు పాత్రల్లో కనిపించి మాయమైపోయిన సుదీప్.. ‘సైరా’తో మళ్లీ తనదైన ముద్ర వేస్తాడని అనుకుంటున్నారు.  గత ఏడాదే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లగా.. తాజాగా సుదీప్ టీంతో కలిశాడు.  ఈ సందర్భంగా చాలా ఉద్వేగంగా ఒక మెసేజ్ పెట్టాడు సుదీప్.  


మరింత సమాచారం తెలుసుకోండి: