తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగ చైతన్యను వివాహం చేసుకున్న తర్వాత సమంత చిత్రాల్లో నటించదని వార్తలు వచ్చాయి. కానీ పెళ్లైన తర్వా ‘రంగస్థలం’, ‘అభిమాన్యుడు’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో దుమ్మురేపింది సమంత. ప్రస్తుతం సమంత తెలుగులో 'యూ టర్న్' సినిమా చేస్తోంది .. తమిళంలో 'సీమరాజా' సినిమా చేస్తోంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సమంత .. ఈ మధ్య తన ప్రతిభను చాటుకునే దిశగా అడుగులు వేస్తుంది.
రంగస్థలం సినిమాలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం కన్నడ రీమేక్ యూ టర్న్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తుంది. ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ షరవేగంగా జరుగుతుంది. యూటర్న్, సీమరాజా ఈ రెండు ప్రాజెక్టుల తరువాత ఆమె ఒక థ్రిల్లర్ మూవీ చేయనున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ లో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన 'కొలాటెరల్' ఘనవిజయాన్ని సాధించింది. ఈ సినిమాలో సమంత కీ రోల్ లో కనిపిస్తుంది.
అర్జున్ రెడ్డి సినిమాకు అసోసియేట్ గా పనిచేసిన గిరీశయ్య దర్శత్వంలో ఈ సినిమా ఉంటుందట. ఈ దర్శకుడు చెప్పిన కథ బాగా నచ్చడంతో సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాలోని ఇతర ముఖ్యమైన పాత్రల్లో మురళీశర్మ .. అరుణ్ ఆదిత్ .. నవదీప్ .. సాయిచంద్ కనిపించనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. ఈ సినిమాలో సమంత రోల్ ఎలా ఉంటుందన్న ఆసక్తి మొదలయింది. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.