జబర్ధస్త్ కామెడీ షో తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న షకలక శంకర్ తర్వాత వెండితెరపై కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అదృష్టం కలిసి వచ్చి వరుసగా సినిమా ఛాన్సులు దక్కించుకున్నాడు. ఈ మద్య కమెడియన్లు హీరోలుగా మారుతున్న తరుణంలో షకలక శంకర్ కూడా ‘శంభో శంకర’ సినిమాతో హీరోగా మారారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు..ఒక కార్యక్రమంలో త్రివిక్రమ్, దిల్ రాజు, రవితేజపై కూడా తనదైన స్టైల్ల కామెంట్ చేశాడు. దాంతో ఇండస్ట్రీలో అదో పెద్ద చర్చనీయాంశం అయ్యింది.
తాజాగా షకలక శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..గతంలో తనపై పవన్ కళ్యాన్ సీరియస్ అయిన విషయంపై క్లారిటీ ఇచ్చారు. జబర్ధస్త్ కామెడీ షో తో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్న తర్వాత పవన్ కళ్యాన్ సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అనుకున్న సమయంలో సర్ధార్ గబ్బర్ సింగ్ లో సినిమా చాన్స్ వచ్చింది. నేను ఆ సినిమా ఒప్పుకున్నదే పవన్ కల్యాణ్ ను దగ్గర నుంచి చూడటానికి. ఏ సీన్ చెబుతున్నారని గానీ .. ఎలా చేయాలని గాని నేను ఎప్పుడూ ఆలోచించలేదు.
ఉదయం నుంచి సాయంత్రం వరకూ పవన్ ని అలా చూస్తూ ఉండేవాడిని .. అయినా తనివి తీరేది కాదు. ఆ సినిమాకి తీసిన సీనే మళ్లీ మళ్లీ తీస్తుండేవాళ్లు..దాంతో నాకు చిర్రెత్తుకొచ్చి కో డైరెక్టర్ పై అరిచాను. ఈ విషయం కాస్త పవన్ కళ్యాన్ వద్దకు వెళ్లింది..దాంతో ఆయన నన్ను పిలిచి..'ఏరా అప్పుడే డైరెక్టర్ ను .. కో డైరెక్టర్ ను అనే రేంజ్ కి వచ్చేశావురా నువ్వు .. వాళ్లు ఎన్నిసార్లు తీస్తే నీకెందుకు .. నీకు అవసరమా? నీ హద్దుల్లో నువ్వుండు .. పనిచేసుకుని పో .. అర్థమైందా .. పో' అన్నారు. ఆ రోజున జరిగింది ఇదే' అంటూ స్పష్టం చేశాడు.