సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా సెన్సేషన్ డైరక్టర్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 2017లోనే రిలీజ్ ఎనౌన్స్ చేసిన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ పడిన సినిమా ఈ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు.


అసలైతే ఈ ఇయర్ సమ్మర్ కు 2.ఓ రిలీజ్ కు సిద్ధమని అన్నారు కాని ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాలేదని మళ్లీ వాయిదా వేశారు. జూలై, ఆగష్టులలో అయినా వస్తుంది అనుకుంటే ఏకంగా నమవర్ 29కి 2.ఓ వాయిదా వేశారు. సినిమా వాయిదా పడటంతో ప్రెజర్ ఎక్కువవుతుంది. 


ఈ క్రమంలో 2.ఓ దర్శకుడు శంకర్ సినిమా రిలీజ్ ఎనౌన్స్ చేయడం విశేషం. నవంబర్ 29న 2.ఓ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఈ డేట్ కు సినిమా కచ్చితంగా వచ్చి తీరుతుందని తెలుస్తుంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న 2.ఓ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఉంటుందని అంటున్నారు.


అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నారు. కబాలి, కాలా సినిమాలతో అభిమానులను నిరాశపరచిన రజిని 2.ఓ తో తన సత్తా చాటుతాడని ఆశిస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుంది అన్నది వేచి చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: