ప్రస్తుతం తాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ పూజా హెగ్దె హవా ఓ రేంజ్ లో కొనసాగుతుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డిజే సినిమాలో బికినితో రచ్చ చేసిన అమ్మడు ఆ దెబ్బతో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ తో అరవింద సమేతతో పాటుగా మహేష్ 25వ సినిమా హీరోయిన్ గా కూడా నటిస్తుంది.


డిజే తర్వాత అమ్మడు చేసిన సినిమా సాక్ష్యం. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈ నెల చివరన రిలీజ్ అవుతుంది. టీజర్, ట్రైలర్ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీగా అనిపిస్తున్నా సినిమాలో పూజా హెగ్దెని కూడా ఫుల్ గా వాడేసినట్టు తెలుస్తుంది. ట్రైలర్ లో అమ్మడి అందాలు చూపించలేదు కాని సినిమాలో రెండు మూడు సీన్స్ లో పూజా మరోసారి బికినితో రెచ్చిపోయిందని టాక్.


అమ్మడి క్రేజ్ ను పర్ఫెక్ట్ గా వాడేశారట దర్శకుడు శ్రీవాస్. ఇక సినిమా మాత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. అందుకే బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఆంధ్రాలో 14 కోట్లకు బిజినెస్ చేసిన సాక్ష్యం. నైజాం వరకు దిల్ రాజు 7 కోట్లకు కొనేశాడట. మొత్తంగా సాక్ష్యం కూడా 40 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. 


స్టార్ సినిమా రేంజ్ బిజినెస్ అయితే చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ హిట్ మాత్రం ఆ రేంజ్ లో అందుకోవట్లేదు. కాని ఈ సినిమా మాత్రం తప్పకుండా అంచనాలను అందుకుంటుందని అంటున్నారు. శ్రీనివాస్ హీరోయిజం తో పాటుగా పూజా హెగ్దె గ్లామర్ ఈ సినిమాకు సపోర్ట్ గా నిలుస్తాయని తెలుస్తుంది. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: