తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా వారసుల హవా జోరుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున వారసులుగా అక్కినేని నాగచైతన్య, అఖిల్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే నాగార్జున మొదటి భార్య తనయుడు అక్కినేని నాగచైతన్య చిన్నతనం అంతా తన అమ్మమ్మ ఇంట్లోనే పెరిగాడు. అంటే దగ్గుబాటి రామానాయుడు ఇంట్లో..ఒక మామ ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు మరో మామ విక్టరీ వెంకటేష్. సినీ నేపథ్యంలోనే పెరిగి పెద్దకావడంతో నాగ చైతన్య కూడా హీరోగా మారారు.
అయితే మామా అల్లుడు ఒకే తెరపై కనిపిస్తారని ఎప్పటి నుంచి వార్తలు వస్తున్నాయి..ఆ మద్య ఓ చిత్రంలో వెంకటేష్ గెస్ట్ గా వచ్చి వేళ్తాడు. కానీ ఫుల్ లెన్త్ చిత్రం ఎప్పుడు వస్తుందా అని అక్కినేని అభిమానులు చూస్తున్న వేళ రానే వచ్చింది. వెంకటేష్, నాగచైతన్య కథానాయకులుగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘వెంకీ మామా’ అనే పేరు పెట్టారు. బాబి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ముహూర్తం రామానాయుడు స్టూడియోలో లాంఛనంగా మొదలైంది.
ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ‘రారండోయ్ వేడుక చూద్దాం’.. తరవాత చై – రకుల్ కలసి నటించడం ఇదే తొలిసారి. వెంకీ సరసన కథానాయిక ఎవరన్నది తేలాలి. అక్టోబరు చివరి వారంలో రెగ్యులర్షూటింగ్ మొదలవుతుంది. ప్రస్తుతం వెంకీ – వరుణ్ల సినిమా షూటింగ్ జరుగుతోంది. అది పూర్తయిన వెంటనే.. ‘వెంకీ మామ’ షూటింగ్ మొదలవుతుంది. మరోవైపు నాగచైతన్య చేతిలో ఉన్న ‘సవ్యసాచి’,‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాలు కూడా ఓ కొలిక్కి వస్తాయి.