యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తన చరిష్మా చూపిస్తూనే బుల్లితెరలోనూ సందడి చేస్తున్నాడు. ఇక వాణిజ్య ప్రకటనలలో కూడా ఎన్టీఆర్ తన సత్తా చాటుతున్నాడు. మహేష్ తర్వాత తెలుగు హీరోల్లో యాడ్స్ చేసే హీరో ఎన్.టి.ఆర్ మాత్రమే. లేటెస్ట్ గా రాం చరణ్ కూడా ఓ మొబైల్ స్టోర్ కు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు.  


హ్యాపీ మొబైల్స్ కు చరణ్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటున్నాడు. ఇక ఇప్పుడు ఎన్.టి.ఆర్ కూడా మరో మొబైల్ స్టోర్ కు బ్రాండింగ్ చేస్తున్నాడు. సెలెక్ట్ మొబైల్ స్టోర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్.టి.ఆర్ ఉండబోతున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో చైన్ స్టోర్స్ తో సెలెక్ట్ మొబైల్ స్టోరెస్ రాబోతున్నాయి.


ఈమధ్యనే భరత్ అనే నేను హీరోయిన్ కియరా అద్వాని రెండు సెలెక్ట్ స్టోర్స్ ను ఓపెన్ చేసింది. ఎన్.టి.ఆర్ సెలెక్ట్ మొబైల్ స్టోర్ కు బ్రాండింగ్ చేయనున్నాడు. కచ్చితంగా ఈ స్టోర్స్ ఎన్.టి.ఆర్ క్రేజ్ తో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మహేష్ ఒకప్పుడు యూనివర్సెల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అల్లు అర్జున్ లాట్ మొబైల్ కు బ్రాండింగ్ చేశాడు.


చరణ్ కూడా హ్యాపీ మొబైల్స్ అని వస్తుండగా ఎన్.టి.ఆర్ మాత్రం సెలెక్టివ్ గా సెలెక్ట్ అంటూ స్మార్ట్ మొబైల్ స్టోర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించనున్నాడు. దీనికి సంబందించిన అగ్రిమెంట్ పూర్తయిందట. త్వరలోనే ఎన్.టి.ఆర్ సెలెక్ట్ స్టోర్ యాడ్ లో కనిపించనున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: