సినీ పరిశ్రమలో ఈ మద్య హీరో, హీరోయిన్లు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొంత మంది వ్యాపార రంగంలతోకి దిగుతున్నారు. ఇప్పటికే కొంత మంది కుర్ర హీరోలు రెస్టారెంట్స్, హోటల్స్ బిజినెస్ లో బిజీగా ఉన్నారు. ఇక హైదరాబాద్ లో రకూల్ ప్రీత్ సింగ్ ఫిట్ నెస్ కి సంబంధించిన జిమ్ నడిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక కొంత మంది కుర్ర హీరోలు రెస్టారెంట్లు, మల్టిప్లెక్స్ వ్యాపారంలో తమ సత్తా చాటుతున్నారు. యంగ్ హీరో విజయ్ దేవరకొండ సైతం తనకు సినిమాల్లో వచ్చిన డబ్బులతో ఇటవలే దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభించాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తన చరిష్మా చూపిస్తూనే బుల్లితెరలోనూ సందడి చేస్తున్నాడు. ఇక వాణిజ్య ప్రకటనలలో కూడా ఎన్టీఆర్ తన సత్తా చాటుతున్నాడు. మహేష్ తర్వాత తెలుగు హీరోల్లో యాడ్స్ చేసే హీరో ఎన్.టి.ఆర్ మాత్రమే. ఇప్పుడు ఎన్.టి.ఆర్ కూడా మరో మొబైల్ స్టోర్ కు బ్రాండింగ్ చేస్తున్నాడు.
ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీ - తెలంగాణ రాష్ట్రాల్లో చిన్న సైజు మల్టీఫ్లెక్స్ థియేటర్లను నిర్మించేందుకు ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. టాలీవుడ్ లో ఇలా థియేటర్లు నిర్మించి ఈ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు బడా నిర్మాత సురేష్ బాబు. ఆయన చేతిలో తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్లు ఉన్నాయి.
ఇప్పుడు ఎన్టీఆర్ సైతం భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు రెడీ అయ్యారు. కాకపోతే.. కార్పొరేట్ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగబోతున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించడానికి ఎన్టీఆర్ సన్నిహితులు నిరాకరించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్నారని అంటున్నారు.