బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న సినిమా మీద నేషనల్ మీడియా కూడా దృష్టి పెట్టింది. ఇప్పటికే తన తర్వాత ప్రాజెక్ట్ మెగా నందమూరి మల్టీస్టారర్ అని ఫిక్స్ చేసిన జక్కన్న అక్టోబర్ నుండి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరిగేలా ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకుంటున్నాడు. 


ఈ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా 300 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. తెలుగు, తమిళ భాషలతో పాటుగా హిందిలో కూడా ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. హిందిలో బాహుబలి రిలీజ్ చేసిన కరణ్ జోహార్ ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నాడు.


ఇక జక్కన్న అలా మల్టీస్టారర్ ఎనౌన్స్ చేశాడో లేదో ఆ వెంటనే శ్రీరాం ఆదిత్య నాగార్జున, నానిలతో దేవదాస్ అంటూ ఓ క్రేజీ మల్టీస్టారర్ ఫిక్స్ చేశాడు. దాదాపు షూటింగ్ చివరకు వచ్చిన ఈ సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా వదులుతున్నారట. అంతేకాదు రాజమౌళి మల్టీస్టారర్ కు పోటీగా దిల్ రాజు మరో మల్టీస్టారర్ ఫిక్స్ చేశాడట.  


వెంకటేష్, మహేష్ లాంటి స్టార్స్ తో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా నిర్మించిన దిల్ రాజు మరోసారి క్రేజీ మల్టీస్టారర్ చేయాలని చూస్తున్నాడు. టాలెంటెడ్ డైరక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. రీసెంట్ గా సమ్మోహనం సినిమాతో హిట్ అందుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ మొదటిసారి పెద్ద నిర్మాతతో సినిమా చేస్తున్నాడు. మరి ఈ మల్టీస్టారర్ కు రాజమౌళి మల్టీస్టారర్ ను ఢీ కొట్టగలిగే సత్తా ఉంటుందో లేదో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: