ఒక యంగ్ హీరోకి ఆరు వరస పరాజయాలు వస్తే ఆ హీరో కెరియర్ పూర్తిగా ముగిసిపోతుంది. అయితే ఎన్ని వరస పరాజయాలు వచ్చినా నిరాశ పడకుండా రెట్టించిన ఉత్సాహంతో సాయి ధరమ్ తేజ్ అనుసరిస్తున్న వ్యూహాలు చాలా మందిని ఆశ్చర్య పరుస్తున్నాయి. 

‘తేజ్ ఐ లవ్యూ’ పరాజయం చెంది ఒక వారం పూర్తి కాకుండానే తేజ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాస్తవానికి ఇది చెప్పుకోతగ్గ న్యూస్ కాకపోయినా ఈ సినిమాకు ఫిక్స్ చేసిన టైటిల్ మాత్రం హాట్ టాపిక్ గా మారి ఈ టైటిల్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. 
Sai Dharam
మెగా స్టార్ చిరంజీవితో ‘ఠాగూర్’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను తీసిన మధు నిర్మాతగా త్వరలో మొదలుపెట్టబోతున్న ఈ మూవీకి ‘భగవద్గీత సాక్షిగా’ అన్న టైటిల్ ఫిక్స్ చేసారు. నూతన దర్శకుడు గోపాల్ ఈసినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ మూవీ టైటిల్ ను బట్టి ఇది ఒక క్రైం స్టోరీ అనుకోవాలా లేదంటే ఒక హాస్య సినిమా అనుకోవాలా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ప్రస్తుతం తేజ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో నటిస్తున్న ‘చిత్రలహరి’ షూటింగ్ పూర్తికాగానే ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. కథను ఎంచుకోవడంలో పొరపాట్లు చేస్తున్నాడు అంటూ సాయి ధరమ్ తేజ్ పై కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో మెగా మేనల్లుడు ఈవిధంగా తన వ్యూహాలు మార్చుకున్నాడు అని అనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి: