తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి తెలుగులో 'పిజ్జా', 'పిజ్జా 2', 'నేనూ రౌడీనే' తదితర సినిమాతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన తెలుగులో మెగాస్టార్ హీరోగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతే కాదు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమాలోనూ కీలక పాత్రలో చేస్తున్నారు. కాగా విజయ్ తమిళంలో కథానాయకుడిగా నటించిన సినిమా 'జుంగా'. గోకుల్ దర్శకత్వంలో, మడోన్నా సెబాస్టియన్ కథానాయికగా నటించిన ఈ సినిమా.. జులై 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాలో విజయ్ సరసన మడోన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా ప్రచారంలో భాగంగా విజయ్ తాజాగా విలేకరులతో మాట్లాడారు. మడోన్నాతో తన స్నేహబంధం గురించి ప్రస్తావించారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ..ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చర్చలు జరుగుతున్నప్పుడు మడోన్నా దీనికి సరిపోతారని అనుకున్నాం. ఆ సమయంలో మడోన్నాకు ఈ సినిమా కథ వినిపించాం..వెంటనే కథ నచ్చి సంతకం చేస్తానని చెప్పింది.
ఆ సమయంలో పారితోషికం మాట్లాడుదామా అంటే..సార్ మీరంటే నాకు ఎంతో నమ్మకం ఉందని..కథ విన్నాక సినిమాపై నమ్మకం పెరిగిపోయిందని..మీరు నాకు దేవుడు లాంటి వారు అంటూ అలాంటిది మిమ్మల్ని ఎలా డిమాండ్ చేయగలను..మీరు ఎంత ఇచ్చినా నాకు సంతోషమే అన్నారు మడోన్నా. త్వరలో ఈ సినిమా ప్రమోషన్ వర్క్ జోరుగా సాగుతుంది. సినిమా చాలా అద్బుతంగా ఉంటుందని విజయ్ అన్నారు.