సూపర్ స్టార్ మహేష్ తన 25వ సినిమా చాలా స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుండగా పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది.


భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల శివ డైరక్షన్ లో శ్రీమంతుడు తర్వాత మళ్లీ భరత్ అనే నేను సినిమాతో హిట్ అందుకున్నాడు మహేష్. ఇక వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. 


ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త లుక్ లో కనిపిస్తున్నాడని తెలిసిందే. ఆల్రెడీ గడ్డం లుక్ తో మహేష్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు. కొన్నాళ్లుగా ఒకేరకమైన లుక్ తో మహేష్ కనిపిస్తుండగా ఈసారి తన 25వ సినిమాలో డిఫరెంట్ లుక్ ట్రై చేస్తున్నాడు మహేష్.    


ఈసారి మహేష్ మాత్రం అదర్గొట్టడం పక్కా అంటున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ చేయాలని ఫిక్స్ చేశారట. భరత్ మేనియా మహేష్ కంటిన్యూ చేస్తాడా లేదా అన్నది చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: