సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది సినీ జంటలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు.  పాత తరం నుంచి నేటి వరకు వెండితెరపై జంటగా నటించి తర్వాత రియల్ లైఫ్ లో కూడా పెళ్లి చేసుకొని జంటగా మారిపోతున్నారు.  తెలుగు లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిలో నాగార్జున, అమల.  ‘శివ’ సినిమాతో ఇద్దరికీ పరిచయం..తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగింది.  ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఏం మాయ చేసావే సినిమాతో పరిచయం అయిన అక్కినేని నాగచైతన్య, సమంతలు తర్వాత కొంత కాలం ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.  


ఇండస్ట్రీలో లవ్లీ కపుల్ ఎవరు? అని అడిగితే... చాలామంది 'చై-సామ్' అంటూ నాగ చైతన్య, సమంత జంట గురించి చెబుతుంటారు. వీళ్లిద్దరి అన్యోన్యత, లవ్ స్టోరీ, పెళ్ళి ఓ రొమాంటిక్ మూవీని తలపిస్తుంది.  ఈ మద్య ఓ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సమంత మీడియా వాళ్లకు షాక్ ఇచ్చింది.  వివరాల్లోకి వెళితే..హైదరాబాదులోని ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమంతను తన భర్త చైతూకి ఇష్టమైన ఫుడ్ గురించి అడిగినప్పుడు తను ఇచ్చిన రియాక్షన్  అందనై షాక్ తిన్నారట.  

Related image

తనకు ఇష్టమైన ఫుడ్ హైదరాబాదీ బిర్యానీ అని బదులిచ్చిన సమంతను తన హబ్బీ చైతూకి ఏదిష్టమో చెప్పమంటే మాత్రం చెప్పకుండా వెంటనే అక్కడి నుంచి సీరియస్ గా వెళ్లిపోయిందట. ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకుంది..తనకే స్వంతమైన తన భర్త గురించి ఎవరైనా పర్సనల్ క్వశ్చన్స్ అడగటం సమంతకు ఇష్టంలేదేమోనని అంతా అనుకున్నారు. చైతూ తనకే సొంతమని, తన భర్త, తమ ఫ్యామిలీకి సంబంధించి వేసే ప్రశ్నలు ఏవైనా సరే... వాటికి జవాబివ్వకూడదని, పాజిటివ్ అయినప్పటికీ తన కుటుంబ విషయాలు బయటపెట్టకూడదని  గట్టి నిర్ణయమే తీసుకున్నట్లుంది సమంత. 


మరింత సమాచారం తెలుసుకోండి: