బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పరుచుకున్న వరుణ్ థావన్ తన సినిమాల ఎంపిక విషయంలో కూడ తన ప్రత్యేకతను కొనసాగిస్తున్నాడు. ఈమధ్య సోషల్ మీడియాలో ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఇస్తూ వరుణ్ థావన్ చేసిన కామెంట్స్ పై జూనియర్ అభిమానులలో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ నిర్మాణంలో ‘రణ్ భూమి’ అన్న భారీ బడ్జెట్ సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది. 
రణ్ భూమిలో ఎన్టీఆర్
ప్రముఖ రచయిత దర్శకుడు శశాంక్ ఖైతాన్ ఈమూవీకి దర్శకత్వం వహించబోతున్నాడు. యుద్ధ నేపధ్యంలో జరిగే కథతో నిర్మించబడుతున్న ఈమూవీలో వరుణ్ థావన్ హీరోగా నటిస్తున్నాడు. 2020 దీపావళికి విడుదల చేయాలి అన్న టార్గెట్ తో ఈభారీ సినిమాను త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇంకా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించే నటీనటుల్ని ఎంపిక చేయవలసి ఉంది. బాలీవుడ్ లో యుద్ధ నేపథ్యం ఉన్న చిత్రాలు ఎక్కువగా విజయవంతం అవుతున్న నేపధ్యంలో ఈమూవీ పై అత్యంత భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. 
ఎన్టీఆర్ ప్రస్తావన
వరుణ్ థావన్ సోషల్ మీడియాలో తన అభిమానులతో ఛాటింగ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక జూనియర్ వీరాభిమాని ఆ ఛాటింగ్ మధ్యకు వచ్చి తమ అభిమాన హీరో జూనియర్ పై వరుణ్ థావన్ అభిప్రాయాలను అడిగాడు. దీనికి సమాధానం ఇస్తూ ఈ బాలీవుడ్ హీరో తాను జూనియర్ అభిమానిని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. దీనితో మరింత రెచ్చిపోయిన ఆ జూనియర్ అభిమాని మీరు వారియర్ గా నటించే ‘రణ్ భూమి’ చిత్రంలో ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారా అంటూ మరో ప్రశ్న వేసాడు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ వరుణ్ ధావన్ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. 
అలాంటి చిత్రాలకు
ఇలాంటి సీక్రెట్స్ దర్శకుడు శశాంక్ మాత్రమే బయటపెడతాడు అంటూ కామెంట్స్ చేయడంతో జూనియర్ బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోందా అంటూ జూనియర్ అభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పురాణ గాధలు, ఫాంటసీ, యుద్ధం నేపథ్యం ఉన్న చిత్రాలకు ఎన్టీఆర్ అతికినట్లు సరిపోతాడనే అభిప్రాయం ఉన్న నేపధ్యంలో వరుణ్ ధావన్ ఇలాంటి కామెంట్స్ చేసి ఉంటాడు అనుకున్నా త్వరలో రాజమౌళి బందిఖానాలోకి వెళ్ళబోతున్న జూనియర్ కు సమయం ఎక్కడ ఉంది అని అనిపించడం సహజం..   



మరింత సమాచారం తెలుసుకోండి: