డిస్ట్రిబ్యూటర్ కమ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు సినిమా ప్లానింగ్ అంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఎంచుకున్న సినిమా కాంబినేషన్, బడ్జెట్, అవుట్ పుట్ ఇలా అన్ని విషయాల్లో తన మార్క్ చూపించే దిల్ రాజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తర్వాత మరో క్రేజీ మల్టీస్టారర్ కు సిద్ధం అయ్యాడు.


రీసెంట్ గా సమ్మోహనంతో కూల్ హిట్ అందుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోలుగా నాని, శర్వానంద్ లను సెలెక్ట్ చేశారట. ఇంద్రగంటి సినిమా అంటే నాని నో అనే ఛాన్స్ లేదు. ఎందుకంటే తనలోని నటుడిని గుర్తించి నానిని హీరోని చేసింది దర్శకుడు మోహనకృష్ణ అని తెలిసిందే.


అష్టా చెమ్మ, జెంటిల్ మెన్ ఈ రెండు నాని రేంజ్ పెంచిన సినిమాలే. ఇప్పుడు ఈ మల్టీస్టారర్ లో నానితో పాటుగా శర్వానంద్ ను ఓకే చేశారట. ఇప్పటికే నాని, నాగార్జునతో దేవదాస్ సినిమా చేస్తున్నాడు. మళ్లీ మరో మల్టీస్టారర్ కు ఓకే చెప్పాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ హవా జోరుగా కొనసాగుతుంది.  


వెంకటేష్, వరుణ్ కలిసి ఎఫ్-2 చేస్తుండగా.. వెంకటేష్, చైతు కలిసి మరో మల్టీస్టారర్ చేస్తున్నారు. ఇక అసలు సిసలు మల్టీస్టారర్ రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేసే మూవీ అక్టోబర్ నుండి మొదలవుతుంది. ఈలోగా నాని, శర్వానంద్ కలిసి మరో క్రేజీ మల్టీస్టారర్ చేయబోతున్నారు. ఈ మల్టీస్టారర్స్ హవా తెలుగు పరిశ్రమకు మంచి పరిణామమే అని చెప్పాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: